భారీ వర్షాలకుప్రాణ, ఆస్తి, పంటలు నష్టపోయిన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. వెంకటాపురం మండలంలో రెడ్కో చైర్మన్ వై.సతీష్రెడ్డి, జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి పర్యటించిన మంత్రి బూర్గుపేట చెరువు కట్ట తెగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా పరామర్శించారు. వరదల ఉధృతికి రోడ్లు కనెక్టివిటీ లేకపోవడంతో వాగులు, వంకలు దాటుతూ, బోట్లు, ట్రాక్టర్, కాలినడకన చేరుకున్నారు. ఎవరూ అధైర్య పడొద్దని ఓదార్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో 55 మందిని కాపాడుకోగలిగామని, 16 మందిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 27 పునరావాస కేంద్రాల్లో 5,400 మందికి భోజనాలు, వసతులు ఏర్పాటు చేశామని వివరించారు. సోమవారం దుస్తులు, టవల్స్ పంపిణీ చేసి, ఇండ్లు శుభ్రం చేయనున్నట్లు చెప్పారు. మెరుగయ్యే వరకు సర్కారు సరుకులు, సామాన్లను అందిస్తుందన్నారు.
ములుగు, జూలై 30 (నమస్తే తెలంగాణ): వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, అధైర్య పడొద్దని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా వరదలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేదు అనుభవాన్ని మిగిల్చాయన్నారు. వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షించి సహాయ చర్యలు సక్రమంగా అందేలా కృషిచేస్తున్నారని తెలిపారు.
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నష్టాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. నాలుగైదు రోజులుగా పనిచేస్తున్న అధికారులకు, రెస్యూటీమ్లకు అభినందనలు తెలిపారు. జిల్లా యంత్రాంగం ఎంతో ప్రయత్నించినప్పటికీ గల్లంతైన వారిలో 16 మంది చనిపోవడం దురదృష్టకరమని తెలిపారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టపోయిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో 55 మందిని కాపాడుకున్నామని చెప్పారు. గతంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే నష్టం జరిగేదని, ఇప్పుడు ఒకే రోజు అధిక వర్షం పడడంతో జంపన్నవాగు, గుండ్లవాగు, దయ్యాల వాగుల్లోకి భారీగా వరద వచ్చిందని తెలిపారు.
గోదావరి నది ప్రవాహం ప్రస్తుతం 10వేల క్యూసెకులతో మొదటి ప్రమాద హెచ్చరికలోపే ఉందన్నారు. ఇసుక మేటలతో వరి పొలాలు చాలావరకు దెబ్బతిన్నాయని తెలిపారు. జిల్లాలో 27 పునరావాస కేంద్రాల్లో 5,400 మందికి భోజనాలు, వసతులు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. మేడారం, నార్లాపూర్ వెళ్లే దారి మరమ్మతులు పూర్తి కాలేదని, రాజకీయాలకతీతంగా అందరూ కలిసికట్టుగా ప్రజలను భరోసా కల్పించాలన్నారు. జిల్లాలో 805 చెరువులు నిండగా, 72 చెరువులు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని, 58 గ్రామాల్లో కరెంట్ నిలిచిపోగా, 40 గ్రామాల్లో వెనువెంటనే విద్యుత్ పునరుద్ధరించినట్లు తెలిపారు. 18 గ్రామాల్లో ఎకువ పోల్స్ విరగడం, ట్రాన్స్ ఫార్మర్స్ కాలిపోవడం వల్ల మరమ్మతులు చేస్తున్నారని వివరించారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు ఇప్పటికే కొనసాగుతున్నాయని చెప్పారు.
ముత్యంధార జలపాతం సందర్శనకు వచ్చిన 82 మంది అడవిలో చిక్కుకోగా కాపాడుకున్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం రిస్ తీసుకొని చాలా బాగా పనిచేశారని అభినందించారు. మేడారం, ఊరట్టం, నార్లాపూర్, ప్రాజెక్ట్నగర్, కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలు అధికంగా దెబ్బతిన్నాయని, నేడు క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లి దొడ్ల బ్రిడ్జికి సంబంధించిన వివరాలు రోడ్ల కనెక్టివిటీ, పంట, ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను తెలియజేస్తానని వివరించారు. వరద బాధితులకు 10 రోజులకు సరిపడ నిత్యాసవర సరుకులను నేడు రెండు జతల బట్టలు, బెడ్షీట్లు, టవల్స్, చీరలు పంపిణీ చేసి, ఇండ్లు శుభ్రం చేస్తామని తెలిపారు. పరిస్థితులు వరకు రాష్ట్ర ప్రభుత్వం వంటకు సరుకులు, సామాన్లను ఉచితంగా అందిస్తుందని చెప్పారు. నేషనల్ హైవే గట్టమ్మ నుంచి పస్రా వరకు తాతాలికంగా రోడ్లు చేయించినట్లు తెలిపారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ రోడ్డు సమగ్ర నివేదిక రూపొందించినట్లు పేర్కొన్నారు. వరదలతో గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు పునరావాస కేంద్రాలు కొనసాగిస్తామన్నారు. మరికొన్ని రోజులపాటు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కాలినడకన బూర్గుపేటకు..
వెంకటాపూర్, జూలై 30 : ప్రకృతి విలతాండవం వల్లే ఇంతటి వరద వచ్చిందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని బూర్గుపేటలో మృతుల కుటుంబాలను ఆదివారం పరామర్శించారు. భారీ వర్షాలకు బూర్గుపేట చెరువు కట్ట తెగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయా కుటుంబాలను కలిసేందుకు బయల్దేరిన మంత్రి భారీ వర్షాలతో రోడ్లు కనెక్టివిటీ లేకున్నా, వాగులు, వంకలు, వెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ బోట్లు, ట్రాక్టర్, కొన్నిచోట్ల వాహనాలు వెళ్లే మార్గం లేకపోవడంతో పలుచోట్ల కాలికడన వెళ్లి బాధితులను కలిశారు. మండలంలోని బండారుపల్లిలోని రాళ్లకుంట వాగు వద్ద రోడ్డు పనులను పరిశీలించిన తర్వాత బూర్గుపేట వద్ద రోడ్డు పనులు చూసి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. గ్రామంలో బాధిత కుటుంబాలను ఓదారుస్తూ వారికి ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మంత్రి తమను కలిసి ధైర్యం చెప్పినందుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవింద్నాయక్, ఎంపీపీ బుర్ర రజితా సమ్మయ్య పాల్గొన్నారు.