హనుమకొండ, జనవరి 29 : వరంగల్ మహానగరంలో శ్రీకర హాస్పిటల్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయని జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని శ్రీకర క్లినిక్, ఫిజియోథెరపీని ఆదివారం ఆస్పత్రి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అఖిల్ దాడితో కలిసి సంపత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోకీలు మార్పిడిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న శ్రీకర హాస్పిటల్స్ సేవలు ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకర హాస్పిటల్స్ చైర్మన్, ప్రముఖ రోబోటిక్ కీలు మార్పిడి, ఆర్థరోసోపి శస్త్రచికిత్స నిపుణుడు అఖిల్ దాడి మాట్లాడుతూ హైదరాబాద్ శ్రీకర హాస్పిటల్స్కు వచ్చే వారిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులే ఎక్కువగా ఉంటున్నారని, ఈ క్రమంలో ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి అంతదూరం రాకుండా ఉండేందుకు హనుమకొండలో శ్రీకర హాస్పిటల్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు ప్రత్యేక వైద్య నిపుణులు వస్తారని తెలిపారు. మోకాళ్ల నొప్పులు, ఆర్థోపెడిక్, న్యూరో, యూరాలజీతోపాటు ఇతర వైద్య సేవలు హనుమకొండలో అందుబాటులోకి వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో శ్రీకర హాస్పిటల్స్ సీఈవో అనిల్ మాదాటి, మోకీలు శస్త్ర చికిత్స నిపుణులు ఈశ్వర్ పటేల్, డాక్టర్ రాకేశ్ కొమురెళ్లి, నిర్వాహకులు కొల్ల శరత్చంద్ర, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.