ఎక్కడో మెక్సికో, పెరూ, బ్రెజిల్ దేశాల మీదుగా మన దేశానికి విస్తరించిన నిద్రమాను చెట్లు ఎంతోమందికి బతుకుదెరువు చూపుతున్నాయి. ఈ వృక్షాల కొమ్మలకు తయారయ్యే జిగురులాంటి పదార్థాన్ని సేకరించేందుకు వివిధ రాష్ర్టాలకు చెందిన వ్యక్తులు మన వద్దకు వస్తున్నారు.
రోజులతరబడి ఇక్కడే ఉండి బంకను సేకరించుకొని వెళ్తున్నారు. దీనిని రంగులు, షూ పాలిష్, గాజుల తయారీకి వాడుతారని, వివిధ కంపెనీలు కిలో బంకకు రూ.1000 నుంచి రూ.1500దాకా చెల్లించి తమనుంచి కొంటాయని చెబుతున్నారు. హనుమకొండ బాలసముద్రంలో నిద్రమాను చెట్ల కొమ్మలను తీసుకెళ్తున్న కలకత్తాకు చెందిన వ్యక్తులను ‘నమస్తే’ పలకరించగా తమ బతుకు దెరువును ఇలా వివరించారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్