చెన్నారావుపేట, డిసెంబర్ 5 : రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్ సూచించారు. సోమవారం ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని రైతువేదికలో భూసారం విలువలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రైతులు భూ సార పరీక్షలు చేయించడం ద్వారా భూమిలో మొక్కకు అందుబాటులో ఉండే మూలకాలు ఎంత మేరకు అం దుబాటులో ఉన్నాయో..? తెలుసుకోవడంతో పాటు ఎరువులను ఎంత మోతాదులో వాడాలి అనేది రైతులకు తెలుస్తుందన్నారు.
భూమిలో ఉన్న భాస్వరాన్ని వాడడం కోసం డీఏపీ వాడకాన్ని తగ్గించి, దాని స్థానం లో పీఎస్బీని వాడడం ద్వారా భూసారంలో మిగిలి ఉన్న భాస్వరాన్ని ఈ పీఎస్బీ మొక్కకు అందేలా తోడ్పడుతుందన్నారు. ఈ విధానంతో రైతులకు పెట్టుబడి తగ్గడమో కాకా భూసారం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ, మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయశాఖ వారు అందిస్తున్న సలహాలను సూచనలను రైతులు పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యులు రఫీ, మం డల కో ఆప్షన్ గఫ్ఫార్, ఆర్ఏఆర్ఎస్ సైంటిస్ట్ వీరన్న, ఎన్ఎఫ్ఎస్ఎమ్ కన్సల్టెంట్ సారంగం, రైతుబంధు సమితి విలేజ్ కోఆర్డినేటర్లు బాలు, ఎఫ్పీఏ సభ్యులు డీలర్స్, రైతులు మహేందర్ రెడ్డి, అడుప సత్తయ్య, రాజిరెడ్డి, కొమురయ్య, కేజీబీవీ విద్యార్థులు పాల్గొన్నారు.
నేలల పరిరక్షణకు నడుం కట్టాలి : ఏడీఏ శ్రీనివాస్
దుగ్గొండి: నేలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని ఎరువుల పరీక్షాకేంద్రం వరంగల్ ఏడీఏ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండలంలోని లక్ష్మీపురంలో ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా నేలల ఆరోగ్యంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించి, గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏడీఏ శ్రీనివాస్ స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, రైతులతో కలిసి పాల్గొన్నారు.
నెక్కొండలో..
నెక్కొండ: నెక్కొండలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ నేల మృత్తిక దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. నేల ఆరోగ్య పరిరక్షణకు తీతసుకోవలసిన చర్యలు, మట్టి నమూనాల సేకరణ, ఎరువుల వినియోగం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ క్యాక్రమంలో మండల వ్యవసాయాధికారి నాగరాజు, జీవ నియంత్రణ ప్రయోగశాల వ్యవసాయాధికారి గోపాల్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా ప్రతినిధి చల్లా చెన్నకేశవరెడ్డి, ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్యర, ఏఈవో వసంత పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్లో..
నర్సంపేట రూరల్: భూసారాన్ని పెంచేందుకు రైతు లు కృషి చేయాలని నర్సంపేట మండల వ్యవసాయ అధికారి కృష్ణకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని లక్నెపల్లి, గురిజాల, మహేశ్వరం, మాధన్నపేట, రాజుపేట గ్రామాల్లోని రైతువేదిక భవనాల్లో ప్రపంచ మృత్తిక (సాయిల్-హెల్త్డే) దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. క్లస్టర్ పరిధిలోని అన్ని గ్రామా ల రైతు బంధు సమితి సభ్యులు రైతులందరితో సమావేశాలు నిర్వహించారు. ఎంపీపీ మోతె కళావతి, ఏఈవోలు నవీన్, భరత్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మోతె జయపాల్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.
భూసార పరీక్షలు చేయించుకోవాలి
వర్ధన్నపేట: రైతులు విధిగా భూసారాన్ని పెంచుకోవాలని ఏడీఏ సురేశ్కుమార్ సూచించారు. ప్రపంచ మృత్తిక(నేల) దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఏడీఏ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమాలలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతు బధు సమితి ప్రతినిధులు, ఏఈవోలు పాల్గొన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం: సేంద్రియ ఎరువుల వాడకంతోనే మృత్తికా రక్షణ సాధ్యమని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని ఖానాపురం, బుధరావుపే, ధర్మరావుపేట గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మృత్తికా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, ఏవో శ్రీనివాస్, ఏఈవోలు సంతోష్, సంధ్య, రాజ్కుమార్ పాల్గొన్నారు.
నల్లబెల్లిలో..
నల్లబెల్లి: ప్రతి రైతు భూసారం పెంచి అధిక దిగుబడులు సాధించాలని ఎంపీపీ ఊడుగుల సునీత సూచించారు. ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని పంచాయతీలు, రైతు వేదికల వద్ద వ్యవసాయంలో రైతులు పాటించాల్సిన మెలకువలపై అవగాహన ర్యాలీలు, అలాగే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి పరమేశ్వర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, సర్పంచ్లు చింతపట్ల సురేశ్రావు, తంగెల్ల నిర్మలారవీందర్రెడ్డి, ఏఈవోలు సాధన, వినూష, భాస్కర్, శ్రీకాంత్రెడ్డి, మహేందర్, మండల నోడల్ అధికారి రామస్వామి తోపాటు రైతులు పాల్గొన్నారు.
కొత్తపేటలో ..
పోచమ్మ మైదాన్, (కాశీబుగ్గ) డిసెంబర్ 5: నగరంలోని 3వ డివిజన్ కొత్తపేటలో మృత్తికా(నేలల) దినోత్సవాన్ని నిర్వహించారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం సంబంధిత వ్యవసాయ కళాశాల వారి దత్తత గ్రామం కొత్తపేటలో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సమావేశం నిర్వహించి, కళాశాల అధ్యాపకుల బృందం రైతులు అవలంబిస్తున్న ఎరువుల యజమాన్యాన్ని పంటల వారీగా అడిగి తెలుసుకున్నారు. లోపాలను, అనుసరించాల్సిన సవరణలను, రైతులకు వివరించారు. సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఉపసంచాలకుడు శ్రీ కృష్ణ సాయిల్ సాంపిల్(మట్టి నమూనా)లను సేకరించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్ హేమశరత్చంద్ర, డాక్టర్ బీ రాజు, స్వాతి, మండల వ్యవసాయాధికారి విజ్ఞాన్, వ్యవసాయ ఉప సంచాలకుడు క్రిష్ణ, హన్మకొండ పీఏసీఎస్ చైర్మన్ హరికృష్ణ పాల్గొన్నారు.
గీసుగొండలో..
గీసుగొండ: రైతులు పొలాల్లో మట్టి పరీక్షలు చేయించుకుని అందుకు తగిన పంటలను సాగు చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్త నాగభూషణం సూచించారు. గ్రేట ర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల గ్రామంలో రైతు వేదికలో సోమవారం ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి, రైతు వేదికలో రైతు ఆవగాహన సదస్సు నిర్వహించారు. శాస్త్రవేత్తలు సౌమ్య, శశాంక్, కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ రా జు, ఏవో హరిప్రసాద్బాబు, ఏఈవో హుసేన్ పాల్గొన్నారు.