వరంగల్ రూరల్ : సంగెం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పర్యటించారు. గ్రామంలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటి గ్రామ సభలో పాల్గొన్నారు. ఆయన వెంట ఉన్న జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ హరి సింగ్, డీఆర్డీవో సంపత్ రావు, ఇతర అధికారులు ఉన్నారు.