హనుమకొండ, డిసెంబర్ 1 : ఆదివారం జరగనున్న ఓట్ల లెకింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులోని స్ట్రాంగ్ రూంల వద్ద జరుగనున్న ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను సిక్తా పట్నాయక్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల ఓట్ల లెకింపునకు సంబంధించి వివరాలను రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. ఓట్ల లెకింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్, ఎల్ఈడీ తదితర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద 24 గంటల పాటు సిబ్బందితో పాటు, సీసీ కెమెరాలతో భద్రత కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్లను కలెక్టర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూం నుంచి కౌంటింగ్ హాల్కు ఈవీఎంలను తరలించే ప్రక్రియ సీసీ కెమెరాలలో రికార్డు అయ్యేలా చర్య లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కౌంటింగ్ నిర్వహణలో నిబంధనలపై సిబ్బందికి అవగాహన ఉండాలన్నారు. ప్రతి కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్ల వివరాలు చూపించి, ఆ తర్వాత అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్ల వివరాలు అందరికీ స్పష్టంగా తెలిసేలా చూపించాలన్నారు. ఆ వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాల్లో14 టేబుల్స్ ఏర్పాటు చేసామని చెప్పారు. పరకాల నియోజకవర్గంలో 17 రౌండ్లు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో18 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి 8 కౌంటర్లు, పరకాల నియోజకవర్గానికి నాలుగు కౌంట ర్లు ఏర్పాటుచేసి ముందుగా లెక్కిస్తామని చెప్పారు. ఓట్ల లెకింపు ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలను మీడియా సెంటర్ ద్వారా విడుదల చేయాలని, మీడియా సెంటర్లో పాత్రికేయులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కాశీబుగ్గ : వరంగల్ జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు షణ్ముగ రాజన్ సంబందిత అధికారులను ఆదేశించారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య, రిటర్నింగ్ అధికారులు షేక్ రిజవ్వాన్ బాషా, ఆశ్విని తానాజీ వాకడే, కృష్ణవేణితో కలిసి వివిద రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫామ్ 17సీ పరిశీలించారు. ఈ సందర్భంగా షణ్ముగ రాజన్ మాట్లాడుతూ మూడు నియోజకవర్గాల్లో నిబంధనల మేరకు అన్ని సక్రమంగా ఉన్నాయన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, అబ్జర్వర్ సమర్పించిన పోలింగ్ వివరాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మూడు నియోజకవర్గాల్లో సక్రమంగా పోలింగ్ నమోదు ప్రక్రియ జరిగిన నేపథ్యంలో ఎక్కడ కూడా రీపోలింగ్ చేయాల్సిన అవసరం లేదని కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీ ప్యాడ్స్ ఇతర ఎన్నికల సామాగ్రిని వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని స్ట్రాంగ్రూంలలో భద్రపరిచారు. సంబంధిత పోలింగ్ సిబ్బంది గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య పర్యవేక్షణలో ఈవీఎంలను అధికారుల నుంచి స్వాధీనం చేసుకొని స్ట్రాంగ్రూంలకు తరలిస్తున్న తీరునును పరిశీలించి భద్రపరిచారు. పత్తియార్డులో వరంగల్తూర్పు అసెంబ్లీ, అపరాల యార్డులో వర్ధన్నపేట నియోజకవర్గ ఎన్నికల సామాగ్రిని అధికారుల స్వాధీనం చేసుకొని స్ట్రాంగ్రూంలకు భారీ భద్రత నడుమ తరలించారు. ఎన్నికల అధికారులతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫారం 17సీ ధ్రువపత్రాలు ఆయా గోడౌన్లలో భద్రపరచి, సీల్ వేశారు. వ్యవసాయ మార్కెట్ను అదనపు భద్రతా సిబ్బంది ఆధీనంలోకి తీసుకొని భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే,తూర్పు ఎన్నికల రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ బాషా, నర్సంపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణవేణి, ఎన్నికల సాధారణ పరిశీలకులు షణ్ముగరాజన్, ఆర్డీవో వాసుచంద్రతో పాటు ఇతర సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య పలు సూచనలు ఇచ్చారు.
వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య, తూర్పు రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్బాషా, ఆశ్వీని తానాజీ వాకడే, కృష్ణవేణితో కలిసి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్యార్డులలో వేర్వేరుగా మూడు కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. ఆదివారం నిర్వహించే కౌంటింగ్కు ఏర్పాట్లను పరిశీలించి పక్కడ్బందీ నిర్వహణకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో వాసుచంద్ర, ఎంవో అబిబ్అలీ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ నాగేశ్వర్రావు, ఈఈలు రాజయ్య, సాంబారి సంజయ్కుమార్ పాల్గొన్నారు.