హనుమకొండ, నవంబర్ 20: ఒకరి కోసం అందరం.. అందరి కోసం ఒకరు అనే నినాదంతో సంఘాలు సంఘటితంగా పని చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ సర్కారు జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకెళ్తున్నదన్నారు. దేశవ్యాప్తంగా కార్మికుల కోసం కార్మిక దినోత్సవాన్ని ఒకరోజు నిర్వహిస్తే కార్మిక మాసోత్సవం పేరుతో నెల రోజులు వేడుకలు జరుపుకుంటున్న ఘనత వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి దకిందన్నారు. కార్మిక మాసోత్సవంలో భాగంగా 11 మంది క్యాన్సర్ బాధితులకు వైద్య చికిత్స అందించినట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంఘం కోసం 2 వేల గజాలలో భవన నిర్మాణానికి రూ. 2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోవద్దని కార్మికులను కోరారు. తను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా, కార్మిక సంఘం నాయకులు వినయ్భాసర్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్గౌడ్, జిల్లా అధ్యక్షుడు ఎండీ సాదిక్, టౌన్ అధ్యక్షుడు సిరికొండ భిక్షపతి, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎంజాల మల్లేశం, గుంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తేలు సారంగపాణి, జిల్లా నాయకులు శివకుమార్, రాజు, నారాయణగిరి రాజు, రమేశ్, కృష్ణయ్య, జాక్సన్, కొండయ్య, ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఘుపతిరెడ్డి, రాజయ్య, రఫీ, సతీశ్ పాల్గొన్నారు. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో నాలుగో డివిజన్ కోఆర్డినేటర్ పేర్ల మనోహర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి 50 మంది బీఆర్ఎస్లో చేరారు. అలాగే, దాస్యం 59వ డివిజన్ భవానీనగర్ డెవలప్మెంట్ కమిటీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, భవానీనగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
హనుమకొండ సిటీ: హైదరాబాద్ తరహాలో హనుమకొండలో వెలమ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ హామీ ఇచ్చారు. కేయూ టు పెద్దమ్మగడ్డ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వెలమ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాస్యం హాజరు కాగా, వారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో వెలమ సంఘం బాధ్యులు మధుసూదన్రావు, ప్రవీణ్రావు, కేశవరావు, గోపాల్రావు, కార్పొరేటర్ రంజిత్రావు, రవీందర్రావు పాల్గొన్నారు.