గోవిందరావుపేట, డి సెంబర్ 26 : జువెల్లరీ షాపులో చోరీ జరిగిన ఘటన మం డలంలోని పస్రాలో ఆదివారం రాత్రి జరి గింది. పస్రా సీఐ శంక ర్ తెలిపిన వివరాల ప్ర కారం.. పస్రాలోని వర లక్ష్మి జ్యూవెల్లరీ షాపును యజమాని తిప్పర్తి నర్సింహాచారి ఆదివారం రాత్రి ఎప్పటిలాగే షెట్టర్లకు తాళం వేసి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం తెల్ల్లవారు జామున న్యూస్ పేపర్ వేయడానికి వచ్చిన పేపర్బాయ్ షెట్టర్ పైకి లేచిన దృశ్యాన్ని చూసి షాపు యజమానికి సమాచారం ఇచ్చాడు. వెంటనే నర్సింహాచారి షాపు వద్దకు వచ్చి చూడగా షెట్టర్ లేచి ఉంది. షాపులోని 8 గ్రాముల బంగారంతో పాటు 2 కిలోల వెండి చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు క్లూస్ టీం ద్వారా చోరీకి పాల్పడిన వ్యక్తుల వేలిముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకర్ తెలిపారు.
చోరీకి పాల్పడిన ఏడుగురు వ్యక్తులు
జ్యూవెల్లరీ షాపులో చోరీ జరిగిన సమయంలో ముగ్గురు వ్యక్తులు ముసుగు ధరించి లోపలికి వెళ్లగా, మరో నలుగురు షాపు ముందు పహారా ఉన్నట్లు సీసీ కెమెరాల పుటేజీల ద్వారా పోలీసులు గమనించారు. షాపులోని షోకేజీలో పెద్ద మొత్తంలో వెండి ఉన్నప్పటికీ వాటిని దొంగిలించేందుకు ప్రయత్నించి అక్కడే వదిలి వెళ్లారు. చోరీకి పాల్పడిన వారు ఎవరెవరు అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.