వరంగల్ : రోడ్డు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని, అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నేరేందర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ చార్ బౌళిలో రూ. 3 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులను డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, స్థానిక కార్పొరేటర్లు బాలిన సురేష్, బస్వరాజు శిరీష, కాంట్రాక్టర్ తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేనివిదంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. చార్ బౌళిలో రోడ్డు పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు. యువ కార్పొరేటర్లు తమ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అన్ని డివిజన్ లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో మరింత గొప్పగా అభివృద్ది చేస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.