హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 21: కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ప్రతిష్టాత్మక బ్రిటిష్ విశ్వవిద్యాలయాల (వేల్స్ గ్రూప్ అఫ్ యూనివర్సిటీలు అయిన అబిర్స్విత్ యూనివర్సిటీ, బంగౌర్ యూనివర్సిటీ) ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. విశ్వవిద్యాలయ అధికారులతో బయోటెక్నాలజీ విభాగంలో సమావేశం నిర్వహించారు. వీసీ తాటికొండ రమేశ్ అధ్యక్షతన వివిధ విభాగాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కేయూ పక్షాన ఆచార్య కే రాజిరెడ్డి, ఆచార్య కే విజయ్బాబు, ఆచార్య బీ సురేశ్లాల్ డిగ్రీస్థాయిలో పాఠ్యప్రణాళికల్లో వస్తున్న ధోరణులు, మార్పులను ఆయా విభాగాల వారీగా, విశ్వవిద్యాలయ పరిశోధనల సామర్థ్యాలు, విజయాలపై ప్రొఫెసర్లు ఆచార్య ఏ సదానందం, టీ శ్రీనివాసులు, గార్లపాటి అచ్చయ్య విశ్వవిద్యాలయ వివిధ పరిశోధనలపై చర్చించారు. అనంతరం అబిర్స్విత్ యూనివర్సిటీ పక్షాన వీసీ ఆచార్య టీం వుడ్స్, బెవ్ హెర్రింగ్ బంగౌర్ యూనివర్సిటీ పక్షాన వీసీ ఆచార్య నికోలా క్యాలావ్, డాక్టర్ ఏమో ఈయో అధ్యాపకులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. రిజిస్ట్రార్ ఆచార్య టీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.