‘అమిత్ షా, రాజగోపాల్రెడ్డి ప్లాన్ చేసి తెలంగాణలో చిచ్చు పెట్టేందుకే మునుగోడు ఎన్నిక తెచ్చిండ్రు. అక్కెరలేని ఎన్నిక తెచ్చిన బీజేపీకి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన్రు. బానిస పనులతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ఫడేల్మని ఢిల్లీకి వినపడేలా చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చిన్రు’ అని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయంపై జనగామలోని యశ్వంతాపూర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణలో సాగవని, ఇకనైనా ఆ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని హితవుపలికారు.
జనగామ, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ షా బానిసైన బండి సంజయ్ని ఫడేల్మని ఢిల్లీ దాకా వినపడేలా చెప్పుతో కొట్టినట్లు మునుగోడు ప్రజలు ఉపఎన్నికలో తీర్పునిచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు అన్నారు. కాంగ్రెస్లో బలమైన నాయకులతో రాజీనామా చేయించి ఉపఎన్నిక తెచ్చి పార్టీకి ఊపు తెచ్చేందుకే వేల కోట్లు ఎరవేసి రాజగోపాల్రెడ్డిని బలిప శువును చేసి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేలా కేంద్రంలోని బీజేపీ పన్నిన కుట్రలను ప్రజలు గమనిం చారని చెప్పారు. టీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోసా డు కాబట్టే ఢిల్లీకి తెలిసేలా మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చారన్నారు. రాజగోపాల్ రెడ్డిని బీజేపీ 18వేల కోట్ల రూపాయలకు కొని బలి చేసిందన్నారు.
హైదరాబాద్లో ఎన్నికల కోసం భాగ్యలక్ష్మి టెంపుల్ను, వరంగల్ ఎన్నికల కోసం భద్రకాళి ఆలయాన్ని, మును గోడు ఎన్నికల కోసం యాదాద్రి ఆలయాన్ని అడ్డం పెట్టుకొని బండి ఆడిన నాటకానికి చైతన్య వంతులైన ప్రజలు తెరదించారని చెప్పారు. మునుగోడులో బీజేపీ ఇచ్చిన హామీలను దేశం మొత్తం అమలు చేయాలని, ఆ మేరకు పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మాట్లాడాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. బయ్యారం ఉకు ఫ్యాక్టరీని సాధిం చలేని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సిగ్గు లేదని దుయ్య బట్టారు. సొంత నియోజకవర్గం కరీంనగర్కు కనీసం మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్ అని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరు గుదలకు ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మేనని, దీంతో సామాన్యులపై మోయలేని భారం పడిం దన్నారు. తనతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య ఇన్చార్జీలుగా ఉన్న గ్రామాల్లో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ వచ్చిందన్నారు. మునుగోడు గోడు వినని మూర్ఖులకు అక్కడి ప్రజలు మంచి గుణపాఠం చెప్పి నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్కు వెన్ను దన్నుగా ఉండి దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పేలా టీఆర్ఎస్ను మునుగోడు ప్రజలు తమ తీర్పుతో దీవించారన్నారు.
యువత గమనించాలి..
‘వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు.. ములుగుకు గిరిజన యూనివర్సిటీ రాలేదు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు.. బయ్యారం ఉకు చెల్లని చెకు అయ్యింది.. జిల్లాకో నవోదయ సూల్ లేదు.. 157మెడికల్ కాలేజీల్లో పక్కనున్న ఏపీకి 17 ఇచ్చి తెలంగాణకు ఒకటీ ఇవ్వలేదు.. ఐటీఐఆర్ ఇవ్వలేదు.. బుల్లెట్ ట్రైన్, హై స్పీడ్ రైలు అంతే సంగతులైంది.. ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు.. ఇవన్నీ తెలంగాణ యువ త, నిరుద్యోగులు గమనించాలి’ అని మంత్రి ఎర్రబెల్లి కోరారు.
తెలంగాణ పథకాలు మీ రాష్టాల్లో ఉన్నాయా?
బీజేపీ డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజిన్గా మారిందని, దేశానికే తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ పథకాలు దేశంలో మరెకడాలేవన్నారు. ‘బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పింఛన్ రూ.2016, రూ.3016 ఇస్తున్నారా? రైతులకు పంట పెట్టుబడి రూ.10వేలు ఇస్తున్నారా? వ్యవసాయానికి 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ ఉందా? రైతులకు రూ.5లక్షల ఉచిత బీమా ఎకడైనా ఉందా?’ అని ప్రశ్నించారు. ‘సీఎం కేసీఆర్ ఆలోచన స్థాయికి లేని మీరా మాకు పోటీ?’ అని నిలదీశారు. ఎప్పటికైనా కేసీఆర్ పాలనే దేశానికి శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, జనగామ మున్సిపల్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్లు పోకల జమున, బాల్దే విజయ, ఎంపీపీ కళింగరాజు, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్రెడ్డి, దిశ సభ్యులు భాగ్యలక్ష్మి, మార్కెట్ వైస్ చైర్మన్ ఆగిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ చిన్నం నర్సింహులు, మున్సిపల్ వైస్చైర్మన్ మేకల రాంప్రసాద్, కౌన్సిలర్లు బండ పద్మ, పాండు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షుడు యాదగిరి, సురేశ్రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు శారద, టీఆర్ఎస్ నాయకులు చిట్ల ఉపేందర్రెడ్డి, బండ యాదగిరిరెడ్డి, పసుల ఏబేల్, ఊడుగుల నర్సింహులు, వంగ ప్రవీణ్రెడ్డి, ఉల్లెంగుల సందీప్, గజ్జి శంకర్, సారయ్య, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
నిఖార్సైన తెలంగాణ విజయం..
‘ఓ వ్యక్తి స్వార్థంపై నిస్వార్థం గెలిచింది.. మునుగోడు ప్రజలు కేసీఆర్ను కడుపులో పెట్టుకొని కాపాడుకు న్నరు.. కుట్రలు, కుతంత్రాలు చేసి మత చిచ్చు పెట్టినా అధర్మంపై ధర్మం గెలిచింది.. ఇది మునుగోడు ప్రజల విజయం.. మత విషం, వి ధ్వంసంపై మానవత్వం విజ యం.. అమ్ముడు పోయిన వ్యక్తిపై నమ్మకం విజయం.. ఢిల్లీ అహంకా రంపై మునుగోడు ఆత్మగౌరవ విజయం.. అరాచకం పై ప్రజల ఆశలు, ఆకాంక్షల విజయం.. అబద్ధాలపై నిజమైన అభివృద్ధి విజయం.. కాంట్రాక్టులు, కమీ షన్ల కకుర్తిపై ప్రజలు కన్నెర్రజేసిన విజయం.. ఎమ్మె ల్యేల కొనుగోలును నిలదీసిన నిఖార్సైన తెలంగాణ విజయం’ అని మంత్రి ఎర్రబెల్లి అభివర్ణించారు.