వెంకటాపూర్, మార్చి 23 : ప్ర పంచ వారసత్వ కట్టడం రామప్పను శనివారం వియత్నాం దేశానికి చెందిన 26 మంది సందర్శించారు. ఆదేశ ఉన్నతాధికారులు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, జర్నలిస్టులు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థలో ఈ నెల 18నుంచి 30 వరకు వరకు శిక్షణ తీసుకునేందుకు వచ్చారు. ఇందులో భాగంగా మన చరి త్ర, వారసత్వ కట్టడాల గురించి తెలుసుకోవడానికి రామప్ప, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడిని సందర్శించారు.
అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశేషాలను అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, టూరిజం గైడ్లు వివరించగా ఆసక్తిగా పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట ఎస్సై చల్ల రాజు, ఆర్ఐ రమేశ్, ఎంసీహెచ్ఆర్డీ అధికారు లు వడ్ల శ్రీనివాస్ ఉన్నారు.