హనుమకొండ చౌరస్తా, మార్చి 21: లాల్బహదూర్ కాలేజీలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా క్రీడా పోటీలను ప్రిన్సిపాల్ అరుణ ప్రారంభించారు. కబడ్డీ, బాసెట్బాల్, 2.5 కిలోమీటర్స్ రన్నింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు, పోటీల్లో ఎన్ఐటీ, కిట్స్, ఎస్సార్ యూనివర్సిటీ, కేయూ బీపీడీ, యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ, కాకతీయ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మహబూబాబాద్, వాగ్దేవి డిగ్రీ కాలేజ్ తదితర జట్లు పాల్గొన్నాయని ఫిజికల్ డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్ రెడ్డి, అధ్యాపకులు రమణారెడ్డి, రాజేశ్వరరావు, శృతి, రజిని, రాఘవేందర్రెడ్డి, సదానందం, రవీందర్, రాధిక పాల్గొన్నారు.