రాయపర్తి, నవంబర్ 28: నేరాలు-ఘోరాలకు సంబంధించిన కీలక కేసుల్లో నిందితులు, అనుమానితులతోపాటు సకల వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించే క్రమంలో పోలీస్ సిబ్బంది ప్రతిభ చూపాలని వర్ధన్నపేట ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు సూచించారు. వర్ధన్నపేట సీఐ గడ్డం సదన్కుమార్తో కలిసి సోమవారం ఆయన మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, లాకప్లు, ఆయుధాల గదులు, సన్నిహిత కౌంటర్, రికార్డులు, రిజస్టర్లు భధ్రపరిచే గదులు, సీసీ కెమెరాల ఫుటేజీలు, పెం డింగ్ ఫైళ్లు, రికార్డులు, రిజిస్టర్లు, సిబ్బంది పనితీరు, మండలంలో నమోదవుతున్న నేరాల సంఖ్య, నేరాల తీవ్రత, నేరాల తీరుతెన్నులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
నేరాలన్నింటికీ పరిష్కారం..
పోలీస్స్టేషన్లో నమోదవుతున్న నేరాలన్నింటినీ సిబ్బంది ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు ఏసీపీ చెప్పారు. అంతేకాకుండా మండలంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేవని ప్రశంసించారు. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గ్రామీణ, పట్టణాల్లో భయాందోళనలకు గురిచేస్తున్న ఆన్లైన్ మోసాలపై ప్రజలు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజా సమూహాన్ని చైతన్యం చేయడానికి పోలీస్శాఖ చేస్తున్న ప్రయత్నాలకు మండల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని వర్గాల వారి సహకారంతో మండల పోలీస్ శాఖ భవిష్యత్లో ఉత్తమ ఫలితాలు సాధించడంతోపాటు మండల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వివరించారు. కార్యక్రమంలో ఎస్సై బండారి రాజు, ఏఎస్సై పళ్లకొండ సదానందం, హెడ్కానిస్టేబుళ్లు గరికపాటి సురేశ్రావు, సింగారపు ఏలియా, గుడికందుల రవీందర్, నసీం అహ్మద్, సిబ్బంది చిదురాల రమేశ్, బొట్ల రాజు, తూళ్ల సంపత్కుమార్, వేముల మహేందర్, కత్తుల శ్రీనివాస్, పల్లం రాజు, బొజ్జం లక్ష్మణ్, దొడ్డిపాటి రవి, బండారి మహేందర్, గొళ్లెన రమేశ్, బానోత్ సుమన్ పాల్గొన్నారు.
విలువలతో కూడిన విద్యనభ్యసించాలి
గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు చిన్నప్పటి నుంచే విలువలతో కూడిన విద్యనభ్యసించాలని, అప్పుడే వారు భవిష్యత్లో జాతి గర్వించే బిడ్డలుగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందని వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాసరావు సూచించారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయపర్తి, మైలారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మానవ విలువలు, సమాజంలో పతనమవుతున్న సంస్కృతీ సంప్రదాయాలు, భవిష్యత్ తరాలకు కానుకలుగా అందించాల్సిన ప్రకృతి ప్రసాదిత వనరులపై ఎథికల్ కెరీర్ గైడెన్స్(ఈసీజీ) పేరుతో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఆయన హాజరైన మాట్లాడుతూ పూర్వకాలంలో ప్రతి ఇంట్లో సీనియర్ సిటిజన్స్ పిల్లలకు మంచీచెడు, రామాయణం, మహాభారత ఇతిహాస గ్రంథాలను పరిచయం చేస్తూ అందులోని నీతి, ఆదర్శనీయ జీవితాలను చెప్పేవారన్నారు. కానీ, ఆధునిక యుగంలో పరిస్థితులు వేగవంతంగా మారుతున్నాయని, కుటుంబ సభ్యులంతా ఆండ్రాయిడ్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కొలువులతో పిల్లల ఎదుగుదలను గాలికొదిలి వేస్తున్నట్లు చెప్పారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్న ఈసీజీ క్లాస్లను విద్యార్థులు వియోగించుకోవాని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, వర్ధన్నపేట సీఐ గడ్డం సదన్కుమార్, ఎస్సై బండారి రాజు, కౌన్సిలర్, ఈసీజీ వ్యవస్థాపకుడు శివప్రసాద్, శిక్షకులు శివరంజని, దిలీప్, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ అయిత రాంచందర్, ఎండీ నయీం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.