సుబేదారి, డిసెంబర్ 9: పోలీసు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకోసం వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో హనుమకొండ కాకతీయ యూనివర్శిటి మైదానంలో నిర్వహిస్తున్న దేహదారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం నిర్వహించిన ఈవెంట్లలో 304 మంది అభ్యర్థులు అర్హత సాధించారని పోలీసు కమిషనర్ డాక్టర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. పోలీసు కమిషనరేట్ ఆ ధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులకు ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. రెండో రోజు 802 మంది అభ్య ర్థులకుగాను 665 మంది ఉదయం 6 గంటలకే కేయూ మై దానానికి చేరుకున్నారు. వీరిలో 304 మంది దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎవరైనా మాయ మాటలు చెప్పితే మోసపోవద్దన్నారు. పురుషుల 1600 పరుగు పందెం పోటీల్లో అర్హత సాదించిన అభ్యర్థులను ఎత్తు కొలత, షార్ట్పూట్, లాంగ్జంప్ ఈవెంట్కు పంపించారు. మూడు ఈవెంట్లలో రెండో రోజు 304 మంది అర్హత సాదించారు. అభ్యర్థుల కోసం ఏర్పాటు తాగునీరు, వైద్య సదుపాయాలను సీపీ పరిశీలించారు. శనివారం నుంచి 14వ తేదీ వరకు మహిళా అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.