8వ విడుత టార్గెట్ 1.68 కోట్లు
జిల్లాలోని 305 నర్సరీల్లో 1,64,47,009 మొక్కలు సిద్ధం
శాఖల వారీగా లక్ష్యాల కేటాయింపు
అత్యధికంగా డీఆర్డీఏకు 70 లక్షలు
జూలై రెండో వారంలో ప్రారంభం
అడవుల శాతాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 8వ విడుత హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో ఈసారి కోటీ 68 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే గ్రామాల వారీగా నర్సరీలను ఏర్పాటు చేసి నాణ్యమైన మొక్కలను పెంచుతున్నది. వాటి సంరక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి రెండు పూటలా నీటిని అందిస్తున్నది. 305 నర్సరీల్లో కోటీ 64 లక్షల మొక్కలను అందుబాటులో ఉంచింది. వీటిని నాటేందుకు శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. ఇందులో అత్యధికంగా డీఆర్డీఏకు 70 లక్షలు, వ్యవసాయ శాఖకు 23 లక్షలు, పంచాయతీరాజ్ శాఖ కు 19 లక్షలు కేటాయించింది. వర్షాలు సమృద్ధిగా కురిసిన తర్వాత జూలై రెండో వారంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీంతోపాటు ఇంటింటికీ ఆరు మొక్కలు కూడా అందించనుంది.
జనగామ, మే 20(నమస్తే తెలంగాణ): ఎనిమిదో విడుత హరితహారానికి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఈ విడుత 1.68 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించింది. డీఆర్డీఏ ఆధ్వ ర్యంలో 24, అటవీ శాఖ 28 నర్సరీలతోపాటు 253 గ్రామ నర్సరీ లు సహా జిల్లావ్యాప్తంగా 305 నర్సరీల్లో కోటీ 64లక్షల 47వేల 9 వేల మొక్కలు పెంచుతున్నా రు. మొక్కలు నాటేందుకు ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాలు నిర్దేశించగా, వర్షాలు సమృద్ధిగా కురిసిన త ర్వాత జూలై రెండో వారంలో హరితహారాన్ని ప్రారం భించనున్నారు. ఎంపిక చేసిన ప్రదేశాల్లో మొక్కలు నా టేందుకు అన్ని శాఖల అధికారులు సన్నద్ధమవుతున్నా రు.
హరితహారాన్ని విజయవంతంగా నిర్వహించేం దుకు అధికారులు 305 నర్సరీల్లో మొక్కలు పెంచుతు న్నారు. ఈ ఏడాది 1,68,00270 మొక్కలు నాటడం లక్ష్యం కాగా, వివిధ నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తు న్నారు. ఎప్పటిలాగే పండ్ల మొక్కలు, గృహాల్లో పెంచు కునే మొక్కలు, రోడ్లు, కాల్వలు, చెరువుల పక్కన నాటే మొక్కలు, రైతులు పొలాల్లో నాటుకునేందుకు టేకు, ఎర్రచందనం, వెదురు, సిల్వర్ఓక్, ఈత, కాను గ, ఫెల్టోఫామ్, గుల్మొహర్, రేల, రెయిన్ట్రీ, నిమ్మ, జామ, మునగ, కరివేపాకు మొక్కలు పెంచుతున్నారు. అలాగే ఉద్యానశాఖ ద్వారా 12లక్షల పండ్ల మొక్కలు పెంచుతున్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం పరి ధిలో నర్సరీల్లో మొత్తం 63,35, 253 మొక్కలు అం దుబాటులో ఉన్నాయి. అందులో స్టేషన్ఘన్పూర్ మండలంలో 16,79,173, చిల్పూరు మండలంలో 4లక్షలు, జఫర్గఢ్ మండలంలో 15,13,000, లింగా లఘనపురం మండలంలో 11,81,200, రఘునాథ పల్లి మండలంలో 15,61,880 మొక్కలు సిద్ధమవు తున్నాయి. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో 41,99,706 మొక్కలు ఉండగా, పాలకుర్తి మండలం లో 14,86, 750, కొడకండ్లలో 16,87,000, దేవరు ప్పుల మండలంలో 10,25, 956 మొక్కలు అందు బాటులో ఉన్నాయి. జనగామ నియోజకవర్గం పరిధి లో 46,16,200 మొక్కలు, అందులో జనగామ మం డలంలో 15,19,000, బచ్చన్నపేట మండలంలో 18,63,100, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో 12,34,100 మొక్కలు పెంచుతున్నారు.
27 ప్రభుత్వ శాఖలకు టార్గెట్..
హరితహారంలో భాగంగా 8వ విడుతలో మొక్కలు నాటేందుకు 27 ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యాలను కేటాయించారు. ఇందులో డీఆర్డీఏకు 70 లక్షలు, అ టవీ శాఖకు 60 వేలు, మున్సిపల్కు 8లక్షలు, ఆర్ అండ్బీకి 50 వేలు , పంచాయతీరాజ్కు 19 లక్షలు, నీటి పారుదల శాఖకు లక్ష, ఎక్సైజ్శాఖకు 6లక్షలు, మై నార్టీ శాఖకు 10 వేలు, ఎండోమెంట్కు 10 వేలు, పో లీసు శాఖకు 10లక్షలు, వ్యవసాయశాఖకు 23 లక్షలు, పశుసంవర్ధక శాఖకు 3 లక్షలు, ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖకు 12 లక్షలు, మార్కెటింగ్ శాఖకు 20 లు, ఆర్టీసీకి 10 వేలు, విద్యాశాఖకు 1,00500, ట్రైబల్ వెల్ఫేర్కు 10 వేలు, బీసీ వెల్ఫేర్కు 10 వేలు, సోషల్ వెల్ఫేర్కు 10 వేలు, ఎన్పీడీసీఎల్కు 20 వేలు, వైద్యారోగ్యశాఖకు 17 వేలు, రెవెన్యూ శాఖకు 10 లక్షలు, మైన్స్ అండ్ జియాలజీ శాఖకు 2లక్షలు, సోష ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టళ్లకు 15 వేలు, జిల్లా సంక్షే మ శాఖకు 10 వేల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దే శించారు. ఎగువ ప్రాంత జనగామ జిల్లాలో ఒక శాతం మాత్రమే ఉన్న అటవీ సంపదను హరితహా రం ద్వారా పెంచేందుకు విరివిగా మొక్కలు నాటే కార్యాచరణపై జిల్లా కలెక్టర్ ప్రభుత్వశాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.