భూపాలపల్లి రూరల్, నవంబర్ 24 : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలి వెళ్లారు. భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి గెలుపు కోసం నిర్వహించిన ఈ సభకు మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ ముంజంపెల్లి మురళీధర్, 16వ వార్డు ఇన్చార్జి బైరెడ్డి లక్ష్మారెడ్డి, 29వ వార్డు ఇన్చార్జి అల్లూరి కుమార్, 22వ వార్డు అధ్యక్షుడు కట్కోజుల రాజు ఆధ్వర్యంలో వార్డుకు 1000 మందికి పైగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభతో భూపాలపల్లి పట్టణం గులాబీమయమైంది.
కృష్ణకాలనీ : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు మున్సిపాలిటీలోని ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. 1వ వార్డు నుంచి చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, 12వ వార్డు నుంచి వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, 27వ వార్డు నుంచి ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్రెడ్డి, 4వ వార్డు నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, 2, 3, 6, 7, 8, 11, 13, 14, 18, 21, 23, 24, 25, 26, 30వ వార్డు నుంచి కౌన్సిలర్లు ఆకుదారి మమతారాయమల్లు, పిల్లలమర్రి శారదానారాయణ, ఎడ్ల మౌనికాశ్రీనివాస్, కొక్కుల స్వరూపారాణి, నూనె రాజు, బానోత్ రజితా జుమ్ములాల్, మంగళపెల్లి తిరుపతి, ధార పూలమ్మ, శిరీషా దేవేందర్రెడ్డి, జక్కం రవికుమార్, మేకల రజితామల్లేశ్, శిరుప అనిల్, సజ్జనపు స్వామి, పానుగంటి హారికాశ్రీనివాస్, మాడ కమలాలక్ష్మారెడ్డి, 5, 15, 19, 20 28 వార్డుల నుంచి ఇన్చార్జిలు పైడిపెల్లి రమేశ్, బండారి రవి, బీబీ చారి, గుమ్మడి భాగ్యలక్ష్మి, రడపాక రమేశ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో సభకు హారయ్యారు. ఈ కార్యక్రమంలో రత్నం సమ్మిరెడ్డి, మాడ హరీశ్రెడ్డి, ఆయా వార్డుల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
టేకుమట్ల : భూపాలపల్లిలో శుక్రవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు మండలంలోని 24 గ్రామాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. వెళ్ళిన వారిలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు సట్ల రవి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు, ప్రజలు ఉన్నారు.
రేగొండ : భూపాలపల్లిలో శుక్రవారం జరిగిన సీఎం సభకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణలు, ప్రజలు భారీగా తరలివెళ్లారు. మండలంలోని బాగిర్ధిపేట క్రాస్ వద్ద సభకు తరలివెళ్తున్న వాహనాల ర్యాలీని పార్టీ మండలాధ్యక్షుడు అంకం రాజేందర్ జెండా ఊపి వాహనాల ప్రారంభించారు. అలాగే గోరికొత్తపల్లి మండల నుంచి సైతం శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. తరలిన వారిలో మోడెం ఉమేశ్ గౌడ్, మైస భిక్షపతి, సామాల పాపిరెడ్డి, కోలెపాక భిక్షపతి, ఐలి శ్రీధర్గౌడ్, కుందూరు విద్యాసాగర్రెడ్డి, కేసిరెడ్డి ప్రతాప్రెడ్డి, కుసుంభ రంజిత్ ఉన్నారు.
గణపురం : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు మండలంలోని చెల్పూర్ నాయకులు ఆ గ్రామ ఎంపీటీసీ చెన్నూరి రమాదేవీమధూకర్ ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. అలాగే ఆయా గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో సభకు హాజరై విజయవంతం చేశారు.
శాయంపేట : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు మండలంలోని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు వర్షంలోనూ భారీగా తరలివెళ్లారు. ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండలాధ్యక్షుడు గుంగల మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో జై తెలంగాణ, జై కేసీఆర్, జైజై గండ్ర అంటూ నినాదాలు చేస్తూ సభకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నందం, కొప్పుల, పత్తిపాక సర్పంచ్లు గోలి మాధురీమహేందర్రెడ్డి, చిట్టిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీటీసీ మేకల శ్రీనివాస్, వంగాల నారాయణరెడ్డి, దైనంపెల్లి సుమన్, ప్రజాప్రతినిధులు, నాయకులు తరలిన వారిలో ఉన్నారు.