భేరీ మోతలు.. గజ్జెల సవ్వడులు.. అవుసరాల విన్యాసాల మధ్య మంద గంపలు, యాటపోతులతో
భక్తజనం సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టుకు పోటెత్తింది. లక్షల గొంతులు ఒ లింగా.. ఓ లింగా
నామస్మరణను హోరెత్తించాయి. ఇలవేల్పును కొలిచేందుకు తరలివచ్చిన యాదవ కుటుంబాలు
లింగమంతులస్వామి, చౌడమ్మకు బోనాలు సమర్పించాయి. 80వేలకుపైగా పొట్టేళ్లను మొక్కుగా
చెల్లించాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా విందు చేసుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ పెద్దగట్టు పరిసరాల్లో ఇసుకేస్తే రాలనంత జన సందోహం
కనిపించింది. మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని, శ్రీనివాస్గౌడ్, ఎంపీ బడుగుల, ఎమ్మెల్యేలు కిశోర్, భూపాల్రెడ్డి, భగత్, షీప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజుయాదవ్
స్వామివారిని దర్శించుకున్నారు.