స్టేషన్ఘన్పూర్, సెప్టెంబర్ 13 : భార్యాభర్తలు గొడవపడి తమ ఎనిమిదేళ్ల బాలుడిని ఎక్కడైనా బతుకుపో అంటూ ట్రైన్ ఎక్కించిన ఉదంతం మంగళవారం స్టేషన్ఘన్పూర్లో వెలుగుచూ సింది. అయితే రైలులో అయోమయంగా, బిక్కు బిక్కుమంటూ చూస్తున్న బాలుడిని కొందరు యు వకులు గమనించి పోలీస్స్టేషన్లో అప్పగించారు. సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకా రం.. సికింద్రాబాద్ హబ్సిగూడకు చెందిన జే అంబిక, శ్రీనివాస్ దంపతులిద్దరు జీవనోపాధి కోసం పెట్రోల్ బంకులో పనిచేస్తుంటారు. వీరి కుమారుడు హబ్సిగూడలోని సెయింట్ ప్రైమరీ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు.
తల్లిదండ్రుల మధ్య గొడవల వల్ల తమ ఎనిమిదేళ్ల కుమారుడిని మంగళవారం సాయంత్రం భాగ్యనగర్ ట్రైన్ ఎక్కించారు. ఎక్కడైనా బతుకు, పెద్దయ్యాక మళ్లీ రా అని పంపించారు. అయితే ట్రైన్లో బిత్తర చూపులు చూస్తున్న బాబును చిల్పూర్ మండల కేంద్రానికి చెందిన యువకులు అక్కనపల్లి సందీప్, పోలు సతీశ్, ఎడ్ల మహిపాల్, పిట్టల శివక్రిష్ణ, వరుణ్, నసరాజు ఆ బాలుడిని గమనించారు. ఎవరు, ఏమిటని అని మణికంఠను వివరాలు ఆరా తీశారు. తల్లిదండ్రులు వదిలేశారని తెలుసుకొని సదరు యువకులు ఆ బాలుడిని స్టేషన్ఘన్పూర్ సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై శ్రవణ్కు అప్పగించారు. బాలుడి వివరాలు సేకరించి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో చైల్డ్లైన్ సెంటర్కు అప్పగిస్తున్నట్లు సీఐ తెలిపారు.