దేశంలో నియంత పాలన కొనసాగుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దస్రుతండాలో శుక్రవారం జరిగిన గీసుగొండ, బొడ్డుచింతలపల్లి, రాంపురం, మనుగొండ, చంద్రయ్యపల్లి, కోనాయిమాకుల, అనంతారం గ్రామాల బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
గీసుగొండ, మార్చి 31 : దేశంలో బీజేపీ నియంత పాలన కొనసాగుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని దస్రుతండా గ్రామ శివారులోని రచన కన్వెన్షన్ హాల్లో శుక్రవారం గీసుగొండ మండల కేంద్రం తో పాటు బొడ్డుచింతలపల్లి, రాంపూరం, మనుగొండ, చంద్రయ్యపల్లి, కోనాయిమాకుల, అనంతారం గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మిగ తా రాష్ర్టాలో కూడా అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు. పరకాల నియోజకవర్గానికి భారీగా నిధులను తెచ్చి అభివృద్ధి చేసిన ట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు కార్యకర్తలు వివరించాలన్నారు.
ప్రశ్నించే వారిపై సీబీఐ, ఈడీ దాడులతో బీజేపీ భయపెడుతోందన్నారు. బీజేపీ పాపం పం డే రోజులు వచ్చాయని, ప్రజలు వారికి గుణపా ఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దేశంలో బీజేపీ రాక్షస పాలనను విమర్శించే, ఎండగట్టే నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. పరకాలకు 3వేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినట్లు తెలిపారు. గ్రామాల వారీగా వాటిని పేదలకు పంపిణీ చేస్తామన్నారు. దళితబంధు కూడా ఇస్తామన్నారు. కొత్త పాత తేడా లేకుండా అందరూ కలిసి పార్టీ బలోపేతానికి పని చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, మండల కార్యదర్శి చల్లా వేణుగోపాల్రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, సర్పంచ్లు బోడకుంట్ల ప్రకాశ్, నాగేశ్వర్రావు, డీ బాబు, కే అనిల్, అశ్విని, రాధాబాయి, రామరాజు, మల్లారెడ్డి నాయకులు ముంత రాజ య్య, చిన్ని, గోలి రాజయ్య, రడం భరత్, రడం శ్రీధర్, ప్రమోద్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.