హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1: ఈ నెల 2 నుంచి 4వరకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, చలనచిత్ర అభివృద్ధి సంస్థ సౌజన్యంతో నిర్వహించే ప్రముఖ రంగస్థల కళాకారుడు ‘పందిళ్ల శేఖర్బాబు స్మారక నాటకోత్సవం-2022’కు ఘనంగా ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో జరిపే ఈ ఉత్సవాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రంగస్థల కళాకారుల ప్రదర్శనలు ఉంటాయని సంస్థ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంతారావు, ప్రధాన కార్యదర్శి ఆకుల సదానందం తెలిపారు. వేడుకల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్, విశిష్ట అతిథులుగా దేశపతి శ్రీనివాస్, మామిడి హరికృష్ణ హాజరవుతారని వివరించారు. 2న రాత్రి 8గంటలకు మిర్యాలగూడ సాంస్కృతిక కళాక్షేత్రం వారి రావణ పద్య నాటకం ప్రదర్శన ఉంటుందని చెప్పారు.
3న ప్రముఖ సాహితీవేత్త సహృదయ అధ్యక్షుడు జీ గిరిజామనోహర్బాబు అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుడా చైర్మన్ ఎస్ సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్ హాజరవుతారని సభ అనంతరం రాత్రి 7.30 గంటలకు భానోదయ నాట్యమండలి వారి భక్త ప్రహ్లాద (బాలలచే) ప్రదర్శన, 8.30గంటలకు తెలంగాణ డ్రమెటిక్ అసోసియేషన్ వరంగల్ వారి గయోపాఖ్యానం పద్య నాటిక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. 4న జరిగే కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, జిల్లా టూరిజం అధికారి ఎం.శివాజీ ముఖ్య, విశిష్ట అతిథులుగా పాల్గొంటారని వివరించారు. రాత్రి 7.30కు జీవీ కళాక్షేత్రం కర్నూలు వారి శ్రీకృష్ణ కమలపాలిక పద్యనాటక ప్రదర్శన ఉంటుందని చెప్పారు. కళాభిమానులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేసి కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. యేటా ప్రసిద్ధ కళాకారులకు ఇచ్చే పందిళ్ల శేఖర్బాబు స్మారక పురసారాన్ని ఈ యేడు చక్రహరి సురేందర్ రాజుకు పందిళ్ల శేఖర్బాబు సోదరులతో అందిస్తామని సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్ తెలిపారు. నాటకోత్సవ ఏర్పాట్లను చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ గురువారం పర్యవేక్షించారు.