ఖానాపురం/కాశీబుగ్గ, ఫిబ్రవరి 25: పాకాల వాగులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ కాశీబుగ్గ 19వ డివిజన్కు చెందిన ఎండీ జాకీర్(24) టైర్ల షాపులో పనిచేస్తున్నాడు. ఆదివా రం సెలవు కావడంతో విందు చేసుకునేందుకు ఇద్దరు మిత్రులు ఎస్డీ షరన్, చింతల్ బ్రిడ్జి ప్రాంతానికి చెందిన ఎస్డీ రెహాన్తో కలిసి వచ్చారు. గిరకతాళ్ల సమీపంలో విందు ఈత కొట్టేందుకు సమీపంలోని వాగు వద్దకు వెళ్లారు. ముగ్గురికీ ఈత రాదు. మొదట జాకీర్ తక్కువ లోతు నీళ్లలో దిగాడు. అతడు నిలబడిన రాయి పాకురు పట్టి ఉండడంతో జారి వాగులో పడిపోయి నీళ్లలో మునిగిపోయాడు.
స్నేహితులు ఇద్దరు అతడిని కాపాడేందుకు నీళ్లలో దిగి మునిగిపోతుండగా కేకలు వేశారు. వారికి చెట్టుకొమ్మ దొరకడంతో పట్టుకున్నారు. కేకలు విన్న ఆటోడ్రైవర్ మడిపెద్ది రమేశ్, రైతు జంపయ్య ఇద్దరిని బయటకు తీశారు. జాకీర్ను రక్షించేందుకు ప్రయత్నించగా అప్పటికే నీట మునిగి మృతి చెందాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకుని మృతదేహా న్ని బయటకు తీసి మృతుడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని నర్సంపేటలోని మార్చురీకి తరలించారు. మృతుడికి తండ్రి ఆటోడ్రైవర్, తల్లి, సోదరుడు ఉన్నారు.
ధర్మసాగర్ : మండలంలోని ఎలుకుర్తి గ్రామం దేవాదుల సౌత్ కెనాల్లో పడి రఘుతేజ ఆదివారం మృతి చెందాడు. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉర్సు కరీమాబాద్కు చెందిన దూడ రఘుతేజ (26) నర్సింగరావుపల్లె గ్రామంలోని మండల అరుణ్ కుమార్ ఇంటికి దశదినకర్మకు వచ్చాడు. రఘుతేజ, అరుణ్కుమార్, రోహిత్ ఎలుకుర్తి సమీపంలోని దేవాదుల సౌత్ కెనాల్ వద్ద కు బహిర్భూమికి వెళ్లారు. కెనాల్లోకి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి రఘుతేజ చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం కోసం ఎంజీఎం దవాఖానకు తరలించారు.