అధికారులు, మిల్లర్ల సమీక్షలో
అదనపు కలెక్టర్ భాస్కర్రావు
జనగామ రూరల్, మే 7: ఈనెలాఖరులోగా మిగిలిన యాసంగి ధాన్యాన్ని బియ్యంగా మార్చేందు కు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కర్రావు ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో యాసంగి ధాన్యా న్ని బియ్యంగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులు, మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2,29,222మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని 16 బాయిల్డ్, 12 రా రైస్ మిల్లులకు అందజేయగా 93శాతం బియ్యం తిరిగి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
12 రా రైస్ మిల్స్ పూర్తిస్థాయిలో ధాన్యాన్ని బియ్యంగా మార్చి అందజేయగా, 16 బాయిల్డ్ రైస్ మిల్స్లో ఏడు మాత్రమే బియ్యంగా మార్చి అందజేశాయని, మిగతా తొమ్మిది బాయిల్డ్ రైస్మిల్స్ అందజేయాల్సి ఉందని వివరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈనెలాఖరులోగా మిగిలిన 9బాయిల్డ్ రైస్ మిల్స్ ఏడు శాతం ధాన్నాన్ని బియ్యంగా మార్చి, 11,583 మెట్రిక్ టన్నులు అందజేసేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రోజారాణి, సివిల్సైప్లె జిల్లా మేనేజర్ సంధ్యారాణి, డీటీఈలు నాయక్, విజయ్, మిల్లర్స్ అధ్యక్షుడు వెంకటనారాయణగౌడ్, బెల్దె వెంకన్న పాల్గొన్నారు.