‘ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మా బతుకుదెరువు పోయింది.. వేలాది మంది జీవితాలు ఆగమవుతున్నయ్.. మేం ఎట్లా బతకాలె’ అంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్, జనగామ జిల్లా కేంద్రంలోసోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయాచోట్ల ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆటోల మీదనే ఆధారపడిన తమ ఉపాధిపై మహాలక్ష్మీ పథకంతో దెబ్బ పడిందని, రోజు వారీగా ఆటోలు నడువక ఆర్థికంగా చితికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు భరోసా కల్పించేలా సర్కారు చర్యలు తీసుకోవాలని కోరారు.
మహబూబాబాద్ రూరల్/జనగామ చౌరస్తా, డిసెంబర్ 18 : రాష్ట్రంలో నూతనంగా అధికారం లోకి వచ్చిన ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మీ పథకంతో తమ జీవితాలు ఆగమవుతున్నాయని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మహబూబాబాద్, జనగామలో వారు భారీ నిర సన ర్యాలీ నిర్వహించారు. జనగామ అదనపు కలె క్టర్ పర్మర్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్కు విన తి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూని యన్ జిల్లాల అధ్యక్షులు నలమాస సాయి, జేరు పోతుల కుమార్ మాట్లాడారు. ఆర్టీసీ బస్సు ల్లోనే మహిళలు వెళ్తుండడంతో ఆటోలు ఖాళీగా ఉంటు న్నాయని, వాటి మీదనే ఆధారపడి జీవించే వా రికి చాలా ఇబ్బంది అవుతోందన్నారు. రోజు వారీ గా ఆటోలు నడువకుంటే పిల్లల స్కూల్ ఫీజులు, ఫైనాన్స్లు వెళ్లక ఆర్థికంగా చితికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి నెలకు రూ.15 వేలు ఆర్థిక సహా యం అందజేయాలని, పిల్లల ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటోబంధు పథ కం అమలు చేసి వారి కుటుంబాలను ఆదుకోవా లని కోరారు. అదేవిధంగా ఆటోలకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ రద్దు చేయాలన్నారు. రవాణా రంగ డ్రైవర్లకు ప్ర త్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పేర్కొ న్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభు త్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్యక్ర మంలో ఆటో యూనియన్ నాయకులు జినక సైదులు, వీరభద్రం, శ్యాం ప్రసాద్, ఇంద్రా రెడ్డి, బాలాజీ, దశరథం, ప్రతాప్, సురేశ్, వీరన్న, బాలు, యాకూబ్, ఎండీ అంజద్, విఠల్, మల్ల య్య, శ్రీనివాస్, యాదగిరి, శ్రీనివాస్, లింగమూ ర్తి, రవి, ఐలయ్య, లక్ష్మణ్, కారు డ్రైవర్స్ అసోసి యేషన్ నాయకులు ప్రభాకర్, లక్ష్మణ్, కొముర య్య తదితరులు పాల్గొన్నారు.