శాయంపేట, మార్చి 26 : పత్తిపాక గ్రామానికి చెందిన ఓరుగల్లు వైల్డ్లైఫ్ జిల్లా కమిటీ సభ్యుడు మారెపల్లి సునీల్పై పోలీసులు దాడి చేశారు. ఈమేరకు ఆయన శాయంపేట పోలీసులకు హెడ్కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్పై మంగళవారం ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తిపాక శివారులో ఉడుతలను చంపిన వేటగాళ్లను సునీల్ పట్టుకున్నాడు. కాగా, వేటగాళ్లలో ఒకరు డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసులు చేరుకున్నారు. వేటగాళ్లతో పాటు సునీల్ను కూడా స్టేషన్కు తీసుకొచ్చి దొంగ మాదిరిగా ఫొటోలు తీయడమే గాక జరిగిన విషయాన్ని హెడ్కానిస్టేబుల్ వెంకట్రామ్నాయక్కు చెబుతున్న క్రమంలో సునీల్ షర్ట్ కాలర్ పట్టుకొని కొట్టారు. అసభ్యకరమైన పదజాలంతో దూషించి గల్లా పట్టుకుని గుంజుకుపోయారని, మరో కానిస్టేబుల్ ఖలీల్ సైతం తనను దుర్భాషలాడి ఫోన్ లాక్కున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇద్దరు పోలీసులు తనపై వేటగాళ్లతో అక్రమ కేసు పెట్టించారని చెప్పాడు. తనను కొట్టి దూషించిన హెడ్కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్పై ఏస్సై శైలజకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని జిల్లా అటవీ అధికారులు, ఉమ్మడి పర్యావరణ ఐక్యవేదిక, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నాడు.