మిషన్ భగీరథ గొప్ప పథకం
మళ్లీ గెలిపించడానికి ఇదొక్క పథకం చాలు
రూ.20కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి
ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యా నాయక్
డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో క్రీడాప్రాంగణం ప్రారంభం
120 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
డోర్నకల్, జూన్17: నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. శుక్రవారం ఆయన డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 5వవార్డు రాజుతండాలో రూ.4లక్షలతో నిర్మించిన తెలంగాణ క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించారు. 120 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నదన్నారు. రూ.20కోట్ల నిధులతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తుం టే, గిట్టని కొందరు కోర్టు స్టేలతో పనులకు ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. నెలకు నాలుగుసార్లు డోర్నకల్కు వచ్చి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రెడ్యానాయక్ కంటే ప్రజాసేవ చేసే నాయకుడు ఈ దునియాలోనే లేడన్నారు. మిషన్ భగీరథ గొప్ప పథకమని, ప్రతి ఇంటికీ వందలీటర్ల శుద్ధి చేసిన జలాలు అందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ను మళ్లీ గెలిపించడానికి ఈ ఒక్క పథకం చాలన్నారు. నియోజకవర్గంలో 65వేల మందికి రైతుబంధు పథకం ద్వారా లబ్ధి చేకూరుతున్నదన్నారు. డోర్నకల్ మండలంలో నాలుగేళ్లలో రూ.30కోట్లు రైతుబీమా పథకం కింద అందించినట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా పథకం ఉన్నాయా అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో చెరువులు, కుంటలు నింపి రెండు పంటలకు సాగునీరు ఇస్తున్నట్లు తెలిపారు. భూమిశిస్తు రద్దు చేసి, రైతులకే ఎదురు పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గతంలో 24గంటల ఉచిత కరంట్ ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 3వేల మంది ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థికసాయం చేసినట్లు తెలిపారు. 38వేల మందికి నెలనెలా ఆసరా పింఛన్లు, నెలకు 200 మంది చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నట్లు వివరించారు. పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించి అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. అనంతరం 120మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ,బీసీ కాలనీ, ఎన్టీర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వాటర్ పౌంటేన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం, ఆర్డీవో కొమురయ్య, మండల అధ్యక్షుడు నున్న రమణ, ఎంపీపీ బాలూనాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు కత్తెరసాల విద్యాసాగర్, వైస్ ఎంపీపీ తుమ్మ వెంకటరెడ్డి, తహసీల్దార్ వివేక్, పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, కౌన్సిలర్లు పోటు జనార్దన్, బోరగళ్ల శరత్బాబు, అశోక్, చంద్రశేఖర్, కందుల అరుణ, పర్వీన్ సుల్తానా, తేజావత్ సంధ్యారాణి, ఎంపీటీసీలు బానోత్ శంకర్కోటి, నున్న మల్లికార్జున్, సర్పంచ్లు గుగులోత్ శ్రీనివాస్, పగడాల అంజయ్య, నాయకులు రామనాథం, కొత్త రాంబాబు, గొర్ల సత్తిరెడ్డి, కొత్త వీరన్న, హైమావతి, వీరభద్రం, యశోధర్ జైన్, ఉదయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
చిన్నగూడూరు, జూన్ 17 : ఉగ్గంపల్లిలోని తన స్వగృహంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. చిన్నగూడూరు, కురవి మండలాలకు చెందిన ప్రియాంకకు రూ.15వేలు, కే నవీన్కు రూ.13వేలు, డీ రమేశ్కు రూ.19వేలు, వీరన్నకు రూ.9వేలు, ఏ నవీన్కుమార్కు రూ.13,500, మంజురలీకి రూ.14వేలు, నితిన్కు రూ.36వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా, ఉగ్గంపల్లిలో ఎమ్మెల్యే రెడ్యా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా నాయకుడు ఆయూబ్పాషా, నాయకులు రవీందర్, మంగీలాల్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.