వరంగల్ : జిల్లాలోని చార్బౌలిలో శనివారం ఉదయం ఓ పాత భవనం కూల్చి వేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న ప్రకాశ్ (32), సునీత (30) మృతదేహాలను పోలీసులు బయటకు వెలికితీశారు. మరో ఇద్దరు కార్మికులు శ్రీనివాస్, జ్యోతి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జ్యోతి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాలను తొలగిస్తున్నారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.