హనుమకొండ, ఆగస్టు 27 : నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ ఈ నెల 31న ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గణపతి మండపాల వద్ద ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మట్టి విగ్రహాలను మాత్రమే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు పది వేల మట్టి విగ్రహాలను అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. కలెక్టరేట్లో విగ్రహాలు అందుబాటులో ఉంటాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ సుధారాణి, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, అధికారులు పాల్గొన్నారు.
వేయిస్తంభాల దేవాలయంలో..
హనుమకొండ చౌరస్తా : చారిత్రక వేయిస్తంభాల ఆలయంలో మహాగణపతి నవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని చీఫ్ విప్ వినయ్భాస్కర్ సూచించారు. ఈ మేరకు గణపతి నవరాత్రోత్సవాల కరపత్రాలను ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మతో కలిసి ఆవిష్కరించారు. కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, వేముల శ్రీనివాస్, ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ నాయకుడు పులి రజినీకాంత్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
గ్రేటర్ 10వ డివిజన్ పద్మాక్షమ్మగుట్ట వద్ద రూ.34 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు చీఫ్ విప్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకన్న, వేముల శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, పులి హరికృష్ణ, నేపాల్రెడ్డి, పాల్గొన్నారు.
31వ డివిజన్లో..
న్యూశాయంపేట : గ్రేటర్ 31వ డివిజన్ హంటర్ రోడ్డులోని సాయినగర్ కాలనీలో రూ.1.80 కోట్ల కుడా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్తో కలిసి చీఫ్విప్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆదే శ్రీరాములు, ఆదె ఉమేశ్, గన్నారపు ప్రసాద్, బాబురావు, ఎనబోతుల సతీశ్, గోపి పాల్గొన్నారు.