కరీమాబాద్, అక్టోబర్ 6: లక్షల రూపాయల ఆదాయం ఉన్నా జిమ్లో సామగ్రికి మరమ్మతులు చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువత ఫిట్నెస్ కోసం కరీమాబాద్లో లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో హనుమాన్ వ్యాయమశాల పేరుతో భవనం నిర్మించారు. అందులో లక్షల రూపాయలు వెచ్చించి జిమ్ సామగ్రి కొనుగోలు చేసి ఏర్పాటు చేశారు. భవనం, జిమ్ నిర్వహణ కోసం సెంటర్కు వచ్చే వారు నెలనెలా ఫీజు రూపంలో డబ్బులు అందిస్తున్నారు. దీంతో వివిధ రూపాల్లో ఏటా లక్షల రూపాయల ఆదాయం సంస్థకు సమకూరుతున్నది. ఇంతవరకు బాగానే ఉన్నా కొంతకాలం క్రితం జిమ్లో సామగ్రి మరమ్మతులకు వచ్చా యి. బాగు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. లక్షల్లో ఆదాయం ఉన్నా వేల రూపాయలు వెచ్చిం చి సామగ్రికి మరమ్మతులు చేపట్టకపోవడంపై జమ్కు వచ్చే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
గ్రంథాలయం ఏర్పాటు చేయాలి..
హనుమాన్ వ్యాయామశాల భవనంలో ఖాళీగా ఉన్న గదుల్లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన భవనంలో ప్రజలకు ఉపయోగపడేలా పుస్తకాలతోపాటు పలు రకాల పత్రికలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉపయోగపడేలా పుస్తకాలు అందుబాటులో ఉంచాలని అభిప్రాయపడుతున్నారు. గ్రంథాలయం ఏర్పాటు చేస్తే పుస్తకాలు అందించేందుకు దాతలు సైతం ముందుకొస్తారని స్థానికులు అంటున్నారు.