ఊరూరా శ్రమదానాల జోరు..
పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన
పదో రోజూ పల్లె, పట్టణ ప్రగతి
నమస్తే నెట్వర్క్ : స్వచ్ఛ పల్లెల కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా ముందుకు కదులుతున్నారు. చేయీచేయీ కలిపి తమ ఊరిని బాగుచేసుకునేందుకు కలిసి పనిచేస్తున్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు తలపెట్టిన ‘పల్లె ప్రగతి’ పనులు పదో రోజు ఆదివారం జోరుగా నిర్వహించారు.
ప్రజలు, పారిశుధ్య సిబ్బందితో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు ఊరూరా శ్రమదానం చేసి వారిలో ఉత్సాహం నింపారు. వీధులు, ఖాళీ ప్రదేశాల్లోని చెత్తాచెదారాన్ని తొలగిస్తూ మురుగు కాల్వలను శుభ్రంచేయించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
వర్ధన్నపేట: మహిళలకు చెత్తబుట్టలు అందించి అవగాహన కల్పిస్తున్న అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ
మహబూబాబాద్ : 19వ వార్డు సీసీడ్రైన్లో చెత్తను తీస్తున్న చైర్మన్ రామ్మోహన్రెడ్డి