మంగపేట, జనవరి 29 : పారిశ్రామిక ప్రాంతమైన కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీకి చెందిన కాలనీలో నివాసముంటున్న కార్మికులు క్వార్టర్స్ను ఖాళీ చేయాలని సోమవారం సాయంత్రం కొత్త యాజమాన్యం నోటీసులిచ్చింది. బిల్ట్ ప్రదేశాలతో పాటు, గోదావరి తీరంలోని ఇన్టేక్వెల్ పరిసరాల్లోకి కార్మికులు, ప్రజలు రావద్దని అందులో పేర్కొన్నది.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో బిల్ట్ కాలనీ ప్రవేశ ద్వారం, కర్మాగారం మెయిన్ గేట్ వద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం పేర్కొనడం గమనార్హం.