హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 22: కాకతీయ విశ్వవిద్యాలయంలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో 23, 24 తేదీల్లో జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. సదస్సుకు సంబంధించిన పోస్టర్లను వీసీ రమేశ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టీ శ్రీనివాసరావు, సెమినార్ డైరెక్టర్ కట్ల రాజేందర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ ఎస్ నరసింహాచారి, ఫ్యాకల్టీ పీ కృష్ణమాచారి, ఒప్పంద అధ్యాపకుడు ఫణీంద్ర, సహాయ రిజిస్ట్రార్ పృథ్వీరాజ్ వల్ల్లాల పాల్గొన్నారు.