ఖానాపురం, జనవరి 22: మౌలిక వసతుల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని రెండో బస్టాండ్ సెంటర్ నుంచి రంగాపురం వరకు బీటీ రెన్యువల్ పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కారణంగా రెండేళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ప్రజలను కాపాడుకున్నామని తెలిపారు. దీంతో అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరిగిందన్నారు.
ఈ ఏడాది నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు అదనంగా మరిన్ని పనులు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి ప్రతిపాదనలను ఆమోదించి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. నిధులను తీసుకురావడమే గొప్ప విషయమని, మంజూరైన ప్రతి పనిని 15 రోజుల్లోనే ప్రారంభించుకునేలా సంబంధిత ఏజెన్సీలు, అధికారులకు ఆదేశాలు జారీ చేసి పూర్తి చేయిస్తున్నట్లు వివరించారు.
మండలంలోని ప్రతి మారుమూల గ్రామం, తండాకు బీటీ సౌకర్యం కల్పించేందుకు నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఖానాపురం మండలంలో 30 ఏళ్లుగా జరుగని అభివృద్ధిని కేవలం ఐదేళ్లలోనే చేసి చూపించామని పెద్ది అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మండలంలోని అన్ని గ్రామాల్లో వందశాతం అంతర్గత సీసీరోడ్ల నిర్మాణానికి రూ. 8 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. మే చివరి నాటికి మండలంలో వందశాతం అభివృద్ధి పనులను పూర్తి చేసుకుంటామని స్పష్టం చేశారు.
రాజకీయాలకు తావు లేకుండా అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. రెండేళ్ల నుంచి రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నర్సంపేట నియోజకవర్గంలో నమోదైందన్నారు. దీంతో దెబ్బతిన్న అన్ని రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు వెల్లడించారు. నర్సంపేట నియోజకవర్గంలో రూ. 150 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, అదేవిధంగా రూ. 50 కోట్లతో సీసీరోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. త్వరలోనే నర్సంపేట అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలువనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నర్సంపేట డివిజన్కు ఇండస్ట్రియల్ ఏరియాగా పేరున్నదని ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. రాగంపేటలో ఏర్పాటు చేసిన విజయలక్ష్మి రైస్ మిల్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు నర్సంపేట అనువైన ప్రాంతమన్నారు. నియోజకవర్గంలో పాకాల సరస్సు ఉండడం వల్ల ఏటా రెండు పంటలు పండుతుండడంతో ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తానని పెద్ది హామీ ఇచ్చారు. పరిశ్రమల పరంగా అభివృద్ధి చెందితే యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు.
రైస్ మిల్లుల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీలు బోడ భారతి, మర్రి కవిత, సర్పంచ్లు చిరంజీవి, ప్రవీణ్కుమార్, బాలకిషన్, సుమన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, తుంగబంధం కన్వీనర్ వేజళ్ల కిషన్రావు, రైస్మిల్లు యజమాని వేముల వెంకటేశ్వర్రావు, సొసైటీ డైరెక్టర్ సునీత, అశోక్ బీఆర్ఎస్ నాయకులు బందారపు శ్రీను, బూస అశోక్, పులిగిళ్ల యాదగిరి, చెల్పూరి శ్రీనివాస్, సురేందర్, బూడిద శ్రీను, రాజేశ్, పీఆర్ఏఈ మణితేజరెడ్డి పాల్గొన్నారు.