నెక్కొండ, మే 1 : సీఎం కేసీఆర్ ఉన్నంతకాలం రైతులకు శ్రీరామరక్ష అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని నాగారం, పెద్దకొర్పోలు, తోపనపల్లి, నెక్కొండ క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో గతేడాది పంట నష్టపోయిన 1300 మంది రైతులకు రూ. 61,13,150లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి గ్రామాల్లోని రైతువేదికల్లో సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు అకాలవర్షాలతో పంటలను నష్టపోతే ప్రతిపక్షపార్టీల నాయకులు పర్యటించిందిలేదని, ఓదార్చిందిలేదన్నారు.
ఇటీవల అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారాల చెక్కులను మరో నెల రోజుల్లో అందించనున్నట్లు తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని ప్రతిపక్షపార్టీల నాయకులకు ఓట్లడిగే నైతికహక్కులేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో రైతులు రెండు పంటలను పండిస్తూన్నారని, దేశంలోనే తెలంగాణ భాండాగారంగా మారిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తోందని, అభివృద్ధి,సంక్షేమం రెండుకళ్లలాంటివన్నారు. దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలుకావడంలేదన్నారు.
ప్రజలంతా సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. అలాగే ఎమ్మెల్యే పలువురికి సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ సరోజహరికిషన్, సొసైటీ చైర్మన్ మారం రాము, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, రైతుబంధు జిల్లా బాధ్యులు చల్లా చెన్నకేశవరెడ్డి, సర్పంచ్లు జల్లె సుదర్శన్, కర్రవెంకట్రెడ్డి, మహబూబ్పాషా, భోంపెల్లి రాజేశ్వర్రావు, ధరవాత్ కల్పన, మండల వ్యవసాయాధికారి నాగరాజు, ఏఈవోలు వసంత, నాగరాజు, అనూష, బిందు, ఎంపీటీసీ అపర్ణరవీందర్, బీఆర్ఎస్ నాయకులు మాదాసు రవి, కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, బొల్లెబోయిన వీరస్వామి, యాసం బాలక్రిష్ణ, ఇటుకాల యాకయ్య, మాతంగిరాజు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.