దుగ్గొండి/ఖానాపురం/సంగెం/చెన్నారావుపేట, మార్చి 30: దుగ్గొండి మండలంలోని కేశవాపురం, నాచినపల్లి, లక్ష్మీపురం ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దుగ్గొండిలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులతో కలిసి సీతారాముల విగ్రహాలను ఊరేగింపుగా కల్యాణ వేదికకు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలని పెద్ది సూచించారు. ఖానాపురంలోని సీతారామచంద్రస్వామి, రంగాపురం, అశోక్నగర్, కోదండరామాలయం, మంగళవారిపేట హనుమాన్ ఆలయం, బుధరావుపేట వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో జరిగిన సీతారాముల పెళ్లి వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం అన్ని ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బుధరావుపేట, రంగాపురం, అశోక్నగర్, మంగళవారిపేటలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య పాల్గొన్నారు. సంగెం మండలం గవిచర్లలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన కల్యాణ వేడుకలకు పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి లింగాల నర్సింహారెడ్డి హాజరయ్యారు. ముమ్మిడివరంలో సర్పంచ్ ఇజ్జగిరి స్వప్న-అశోక్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అలాగే, మండలంలోని అన్ని ఆలయాల్లో రాములోరి పెళ్లిని ఘనంగా నిర్వహించారు. చెన్నారావుపేటలో సీతారాముల కల్యాణ వేడుకను సర్పంచ్ కుండె మల్లయ్య ఆధ్వర్యంలో సంకటి చంద్రమౌళి, గొడిశాల సురేందర్ దంపతులు నిర్వహించారు. సిద్దేశ్వరాలయంలో అర్చకుడు భిక్షపతి, లింగాపురంలో శివకుమార్, రాజేందర్, ఖాదర్పేటలో సర్పంచ్ అనుముల కుమారస్వామి-రమ దంపతులు సీతారాముల కల్యాణాన్ని జరిపించారు.
నర్సంపేటరూరల్/నర్సంపేట/నల్లబెల్లి/గీసుగొండ/వర్ధన్నపేట(రాయపర్తి): శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జిల్లాలో భక్తిభావం ఉప్పొంగింది. నర్సంపేట మండలంలోని ముగ్దుంపురం, గురిజాల, గుంటూరుపల్లి, లక్నేపల్లి, రామవరం, భోజ్యానాయక్తండా, ముత్తోజిపేట, ఇటుకాలపల్లి, రాజపల్లి, మాదన్నపేట, కమ్మపల్లి సర్పంచ్లు పెండ్యాల జ్యోతి, గొడిశాల మమత, కర్నాటి పార్వతమ్మ, గొడిశాల రాంబాబు, కొడారి రవన్న, భూక్యా లలితా వీరూనాయక్, గోలి శ్రీనివాస్రెడ్డి, మండల రవీందర్, నామాల భాగ్యమ్మ, మొలుగూరి చంద్రమౌళి, వల్గుబెల్లి రంగారెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలను బ్యాండ్ మేళాల మధ్య ఆలయాలకు తీసుకెళ్లారు. పట్టణంలోని ద్వారకాపేట శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు ఆరుట్ల వెంకటాచార్యులు, శ్రీధరాచార్యుల వేదమంత్రోచ్ఛారణల మధ్య వేడుకలు జరిగాయి. అలాగే, నర్సంపేటలోని అయ్య ప్ప రామాంజనేయ, శివాంజనేయ, రామాలయం, రెడ్డి ఫంక్షన్ హాల్, వాసవీ, సీతారామ ఆలయాల్లో కల్యాణ వేడుకలు నిర్వహించారు. నల్లబెల్లి మండలవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని రామాలయంలో జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకను తిలకించారు. గీసుగొండ మండలంతోపాటు గ్రేటర్ వరంగల్లోని 15, 16వ డివిజన్లో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద రామాలయంలో శ్రీసీతారాముల పరిణయ ఘట్టాలను వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కనులపండువగా జరిపించారు. అనంతరం గ్రామస్తులు, భక్తుల సమక్షంలో పురాతన ఆలయ జీర్ణోద్ధరణలతోపాటు నూతన ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుంకరి సాంబయ్య తన తండ్రి స్మారకార్థం రూ.1,00,116 ఉత్సవ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. అలాగే, గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు తన తండ్రి జ్ఞాపకార్థం రూ. 50,116, జిల్లా వైశ్య సంఘం అధ్యక్షుడు పుల్లూరు మధు రూ. 50,116 అందించారు.
పర్వతగిరి: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులు మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేణుగోపాలస్వామి, పర్వతాల శివాలయాన్ని సందర్శించారు. ఎర్రబెల్లి ట్రస్టు చైర్పర్సన్ ఉషాదయాకర్రావు తమ స్వగృహంలో సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు పాల్గొన్నారు. కాగా, మండలంలో సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. వడ్లకొండ, కొంకపాక, ఏనుగల్లు, చింతనెక్కొండ, పర్వతగిరి, అన్నారం షరీఫ్, కల్లెడలో నిర్వహించిన వేడుకలకు ప్రజాప్రతినిధులు