దుగ్గొండి : సబ్బడ వర్గాలకు అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్నాడని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. గురువారం మండలంలోని నాచినపల్లి గ్రామంలో పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ముదిరాజ్ల ఆరాధ్య కులదైవమైన పెద్దమ్మతల్లి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను ఆలయ కమిటీ సభ్యులు, ముదిరాజ్ సంఘం నాయకులు వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అద్యక్షుడు, ఎమ్మెల్సీ బండాప్రకాశ్ మాట్లాడుతూ ముదిరాజ్ల ఆర్థిక అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అన్నిరంగాల్లో రాణించాలన్నారు. పెద్దమ్మతల్లి ఆశీస్సులతో ముదిరాజ్లకు సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో పెద్ద పీట వేస్తున్నాడన్నారు.
ఆలయాల అబివృద్ధికి ప్రత్యేక నిధులు… నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
రాష్ట్రం ఏర్పడిన తర్వాత శిథిలావస్థలో ఉన్న అనేక దేవాలయాలను, పురాతన కట్టడాలను పునరుద్ధరిస్తు అభివృద్ధికి ప్రత్యేక నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. గ్రామంలో పెద్దమ్మతల్లి ఆలయ అభివృద్ధికి తనను రూ. 4లక్షల సీడీఎప్ నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ముదిరాజ్ల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు.
గిర్నిబావిలో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్కి ఘన స్వాగతం..
నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికై మొట్ట మొదటి సారిగా మండలానికి వచ్చిన రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అద్యక్షుడు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్కు ఘన స్వాగతం పలికారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం పలువురు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.