నెక్కొండ : పల్లెల సమగ్ర అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని అమీన్పేట ఎంపీటీసీ బాదావత్ దస్రు గురువారం కాంగ్రెస్కు రాజీనామ చేసి టీఆర్ఎస్లో చేరాడు. ఎమ్మెల్యే ఎంపీటీసీ దస్రూకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్తో పల్లెలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా యని టీఆర్ఎస్ అభివృద్ధికి ఆకర్షితులైన ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, జడ్పీటీసీ సరోజన హరికిషన్, నర్సంపేట బార్ అసొసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, నెక్కొండ ఉప సర్పంచ్ వీరభద్రం, దీక్షకుంట ఎంపీటీసీ లింగాల అజయ్, టీఆర్ఎస్ నాయకులు గరికెపాటి కోటేశ్వర్రావు, తేజావత్ రవీందర్, శోభన్ పాల్గొన్నారు.