చెన్నారావుపేట/ఖానాపురం, అక్టోబర్ 4: దశాబ్దాల నాటి పాకాల రైతుల కల త్వరలోనే సాకారం కానుండడం ఆనందంగా ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. చెన్నారావుపేటలోని మున్నేరు వాగుపై రూ. 18.70 కోట్లతో బ్రిడ్జి, చెక్డ్యాం, బోజెర్వు గ్రామ పంచాయతీ పరిధిలోని జగ్గుతండా వద్ద రూ. 7 కోట్లతో చెక్డ్యాం వారధి నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, తిమ్మరాయిన్పహాడ్ సర్పంచ్ కొండవీటి పావని-ప్రదీప్ గ్రామంలో నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా ఖానాపురం నుంచి రంగాపురం వరకు కార్యకర్తలు, రైతులతో కలిసి ఎమ్మెల్యే బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం చెన్నారావుపేట సొసైటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో మాట్లాడి ఇంటర్ స్టేట్, హైడ్రాలిక్ అనుమతులు తీసుకొచ్చి చెన్నారావుపేట, ఖానాపురం శివారులో ప్రవహిస్తున్న మున్నేరు వాగుపై చెక్డ్యాం, బ్రిడ్జి నిర్మాణ పనులకు నిధులు మంజరు చేయించినట్లు తెలిపారు. పాకాల వాగుపై రూ. 19 కోట్లు, రూ. 8 కోట్లు, రూ. 7 కోట్లతో మూడుచోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామన్నారు. గత పాలకులు బ్రిడ్జి, చెక్డ్యాం నిర్మాణానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని విమర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే వాగుపై వారధి నిర్మాణం ఆలస్యమైందన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పదవులపై పెటిన శ్రద్ధ ప్రజా సంక్షేమంపై పెట్టి ఉంటే రైతుల కష్టాలు ఎప్పుడో తీరునన్నారు. గతంలో వారు చేయలేని చాలా పనులను తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.
ఈరోజు నిర్వహించిన కార్యకర్తల ర్యాలీ కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు కథ ముందున్నదని ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. కార్యక్రమంలో చెన్నారావుపేట నుంచి బీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, మండల నాయకుడు బాల్నె వెంకన్న, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, జడ్పీటీసీ పత్తినాయక్, పీఏసీఎస్ చైర్మన్లు సత్యనారాయణరెడ్డి, మురహరి రవి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, ఎంపీటీసీ ధరావత్ శ్రీను, మాజీ ఎంపీపీ జక్క అశోక్, వీరారెడ్డి, నాయకులు కంది కృష్ణచైతన్యరెడ్డి, తూటి శ్రీనివాస్, సర్పంచ్లు కుండె మల్లయ్య, అనుముల కుమారస్వామి ఖానాపురం నుంచి ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ ప్రకాశ్రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న ఎంపీడీవో సుమనావాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ ఉమారాణి, సర్పంచ్ కందిక నరేశ్, తిమ్మరాయినిపహాడ్ సర్పంచ్ కొండవీటి పావని, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, గ్రామ అధ్యక్షుడు బంధారపు శ్రీను పాల్గొన్నారు.