‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో రెండురోజుల పాటు నిర్వహించిన ప్రాపర్టీ షో దిగ్విజయవంతమైంది. రెండు రోజుల పాటు షోకు తరలివచ్చిన సందర్శకులతో స్టాళ్లు, హరిత హోటల్ కిటకిటలాడాయి. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు, అధికారులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి గృహ నిర్మాణం, బ్యాంకు రుణాలపై తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకున్నారు. సోమవారం జరిగిన ముగింపు సమావేశానికి వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు హాజరై షోలో స్టాళ్లు ఏర్పాటు చేసినవారికి జ్ఞాపికలు అందించారు. ఎమ్మెల్యే శంకర్నాయక్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు స్టాళ్లను సందర్శించి ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’పై ప్రశంసల వర్షం కురిపించారు.
హనుమకొండ, నవంబర్ 28 : రెండు రోజుల పాటు హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షోకు అద్భుత స్పందన వచ్చింది. ఆది, సోమవారాల్లో ఉదయం 10గంటల నుంచి రాత్రి వరకు సందర్శకులు వచ్చి తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకున్నారు. సోమవారం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో తర లివచ్చారు. ముగింపు కార్యక్రమానికి ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు హాజరయ్యారు. షోలో స్టాళ్లను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. హనుమకొండ, వరంగల్తో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకులు ఇక్కడ 15 స్టాళ్లు ఏర్పాటు చేయగా, వారికి ముఖ్య అతిథులు మెమోంటోలు అందించారు. సందర్శకుల నుంచి లక్కీ డ్రా తీసి ఎంపికైన ముగ్గురికి బహుమతులు అందజేశారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, ఎమ్మెల్యే శంకర్నాయక్ స్టాళ్లను సందర్శించారు. వరంగల్, హనుమకొండ నగరంతో పాటు చుట్టుపక్క ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి వెంచ ర్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, బ్యాంకు రుణాల సదుపాయాలపై పూర్తి సమాచారం తెలుసుకున్నారు. గృహ నిర్మాణం, బ్యాంకు రుణాలకు సంబంధించి ఒకే వేదికపై సమాచారం తెలుసుకునే అవకాశం కల్పించిన ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ యాజమాన్యాలను అభినందించారు.
అట్టహాసంగా ముగింపు
ప్రాపర్టీ షో సోమవారం రాత్రి అట్టహాసంగా ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితమైన ఇలాంటి ప్రాపర్టీ షోలు అభివృద్ధి చెందుతున్న వరంగల్లాంటి నగరాల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకొనే వారికి ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి?, బ్యాంకుల ద్వారా రుణాలు ఎలా పొందవచ్చు?, డాక్యుమెంట్లు ఏమేం కావాలి?, చెల్లింపులు ఎలా ఉంటాయి? తదితర విషయాలను ఒకే చోట తెలుసుకోవడం అరుదైన అవకాశమన్నా రు. ‘నమస్తే తెలంగాణ’ వరంగల్ జిల్లా యూనిట్ కార్యాలయ మేనేజర్ పందిళ్ల అశోక్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ప్రాపర్టీ షోలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఏడీవీటీ జీఎం ఎన్ సురేందర్రావు, డీజీఎం ప్రవీణ్, ఏజీఎం రాజిరెడ్డి, వరంగల్ బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్, అడ్వైర్టెజ్మెంట్ మేనేజర్ ఏ సూరయ్య, సర్క్యులేషన్ మేనేజర్ ఏ సురేశ్రెడ్డి, ప్రొడక్షన్ చీఫ్ మేనేజర్ సీహెచ్.వేణుగోపాల్, నజీర్, నిరంజన్, రవీందర్రెడ్డి, శ్రీనివాస్, స్టాఫర్లు వీ రాజేశ్వర్రావు, కే రాజు, శ్రీధర్రావు, ఎన్ఆర్ అనిల్కుమార్, ఫొటోగ్రాఫర్లు జీ వెంకన్న, సీహెచ్ శ్యాం, ఆర్సీలు టీ కామేశ్వర్, సీహెచ్.సత్యనారాయణ, కే దేవేందర్రెడ్డి, రాజ్కుమార్, రిపోర్టర్లు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల తాకిడి
ప్రాపర్టీ షో సందర్శనకు సోమవారం ప్రజాప్రతినిధులు, అధికారులు వెల్లువెత్తారు. ఎంపీ పసునూరి, ఎమ్మె ల్సీ తక్కళ్లపల్లితో పాటు ఎమ్మెల్యే శంకర్నాయక్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, వైస్ చై ర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, డీఆర్డీవో ఏ శ్రీనివాస్కుమార్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి మేన శ్రీను, ఐ అండ్ పీఆర్ డీడీ లక్ష్మణ్కుమార్, పర్యాటక శాఖ అధికారి శివాజీ, టీజీవో నాయకులు డాక్టర్ ప్రవీణ్కుమార్, సురేశ్కుమార్, మాధవరెడ్డి, ప్రభాకర్రెడ్డి, రఘుపతిరెడ్డి, వరంగల్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గజ్జెల రామ్కిషన్, ప్రధాన కార్యదర్శి గాజ వేణు, నాయకులు గద్దల రాజు, రామకృష్ణ, రమేశ్, రఫీ, నాగేశ్వర్రావు, భాస్కర్, అశోక్, ఎల్కతుర్తి సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్రెడ్డి, వైస్ చైర్మన్ మునిగంప శేషగిరి, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ పోరెడ్డి రవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీ నగేశ్, భీమదేవరపల్లి ఎంపీవో కుసుమ నాగరాజు, ముల్కనూర్ జీపీ ఈవో జంగం పూర్ణ చందర్, కమలాపుర్ సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రావు, సింగిల్ విండో చైర్మన్ తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, డీసీసీ డైరెక్టర్ పోరండ్ల కృష్ణప్రసాద్, పీఆర్టీయూటీఎస్ మండల అధ్యక్షుడు పటేల్ శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శీలం ప్రకాశ్బాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, రాజేశ్వర్రెడ్డి, విశ్వభారతి పాఠశాల కరస్పాండెంట్ ఎడ్ల మధుబాబు, పశు వైద్యాధికారి అరుకాల బాలకృష్ణ, దామెర జడ్పీటీసీ గరిగే కల్పన కృష్ణమూర్తి, ఎంపీపీ కాగితాల శంకర్, మాజీ వైస్ ఎంపీపీ కాడబోయిన భిక్షపతి, పరకాల వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్రెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ చందుపట్ల సుజాత తిరుపతిరెడ్డి, గీసుకొండ మండల యూత్ అధ్యక్షుడు శిరీష శ్రీకాంత్, దళిత బంధు కన్వీనర్ కోట ప్రమోద్, జాగృతి జిల్లా అధ్యక్షుడు యార బాలకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, లెనిన్, శంకర్ ఉన్నారు.
ప్రాపర్టీ షో స్పాన్సర్లు
ప్రాపర్టీ షోలో మెయిన్ స్పాన్సర్గా ఏవీ ఇన్ఫ్రాకాన్, అసోసియేట్ స్పాన్సర్గా బిల్లా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్, గిప్ట్ స్పాన్సర్గా నీలోఫర్, అసోసియేషన్ విత్ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా, డబ్ల్యూడీసీసీబీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు, కనకదుర్గా హోమ్స్, మైత్రీ ఇన్ఫ్రా ప్రాజెక్టు, జీఎంఆర్ గోకులం, మేఘా, ఆవని, జేఎస్ఆర్ సన్సిటీ, శాశ్విత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వ్యవహరించాయి.
సామాన్యుల సొంతింటి కల సులభతరం చేసేందుకే..
సామాన్యుల సొంతింటి కల, ప్రాపర్టీ తీసుకునే ముందు ప్రజ ల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన ప్రాపర్టీ షోను విజయవంతంగా నిర్వహించాం. నమ్మకమైన వాటిని ఎంచుకోవడం, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాల్ని కూడా పొందేందుకు ఏర్పాటుచేసిన ప్రాపర్టీషోకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐపాస్, టీఎస్బీపాస్ తీసుకొచ్చి 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నది. వెంచర్స్, విల్లాస్, కనస్ట్రక్షన్, బ్యాంకర్స్ ద్వారా కొనుగోలుదారులకు సులభతరం చేసేందుకు ఒక వేదికగా నిలిచింది. లేఅవుట్స్లో డీటీపీసీ, కన్స్ట్రక్షన్ అన్నీ చూసుకొని భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండాలని ప్రజలు జాగ్రత్తగా చూస్తున్నారు. అందుకోసం నాలుగు నేషనల్ బ్యాంకులు, ఒక కో ఆపరేటివ్ బ్యాంకు ద్వారా అవగాహన కల్పించాం. ప్రజలు ప్రాపర్టీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొనుగోలుదారులకు సులభతరం చేసేలా బ్యాంకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రాపర్టీ షో చక్కని వేదిక ఏర్పాటు చేశాం. వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
– ఎన్.సురేందర్రావు, నమస్తే తెలంగాణ ఏడీవీటీ జీఎం
ఇల్లు ప్రతి ఒక్కరి స్వప్నం
ఇల్లు ప్రతి ఒక్కరి స్వప్నం. ప్రజలు ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఎక్కడా డబ్బుకు భద్రత లేదు, వడ్డీలకు ఇచ్చే పరిస్థితి లేదు. వ్యాపారం చేసుకునేలా లేదు. జాగ కొనుక్కుంటే 2, 3 రెట్లు పెరుగుతుంది. అందుకు భూమి మీద పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు కట్నాల కింద ఇల్లు జాగలే ఇస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా కాకుండా డీటీసీపీ లేఅవుట్లు చూస్తున్నారు. అందులో రోడ్లు, డ్రైనేజీ వెంచర్లలో వెంటనే ఇల్లు కట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాంకులు కూడా లక్షల కోట్లు తీసుకొని పారిపోయేవారికి కాకుండా సామాన్య ప్రజలకు, ముఖ్యంగా ఇల్లు కట్టుకునే వారికి, స్థలాలు కొనుక్కొనే వారికి రుణాలను ఇస్తున్నారు. మోసం చేసేది లేదు కాబట్టి ప్రజలకు రుణలు కూడా ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకొస్తున్నారు. డీటీసీపీ పర్మిషన్ కూడా వెరిఫై చేసి తీసుకుంటున్నారు. అన్ని ఉన్నాయని పక్కాగా చూసి కొనుగోలు చేయాలి.
– ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు
ప్రాపర్టీ షో మంచి కార్యక్రమం..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో మంచి కార్యక్రమం. వరంగల్లో భూములకు ఇప్పుడు మంచి ధరలు ఉన్నాయి. ఇల్లు కొనేవారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచి ఆహ్లాదకరమైన వాతావారణాన్ని, పెట్టిన పెట్టుబడులకు మంచి ఉపయోగకరంగా ఉండేలా చూస్తున్నారు. లేఅవుట్లలో అన్ని సౌకర్యాలు చూస్తున్నారు. నీటి సమస్య లేకుండా, రోడ్లు, డ్రైనేజీలు, పార్కు కావాలనుకుంటున్నారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ చాలా అభివృద్ధి చెందింది. హైదరాబాద్లో ఎటువెళ్లినా గంట పడుతుంది. వరంగల్ నగరంలో ప్లాట్లు కొనుగోలు చేసి మంచి వాతావరణంలో ఉండాలి. బ్యాంకు అధికారుల సహకారంతో లోన్లు ఇప్పించేందుకు మంచి వేదిక ఏర్పాటుచేయడం అభినందనీయం.
– వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్
అన్ని విధాలా వరంగల్ అభివృద్ధి..
సీఎం కేసీఆర్ హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. అత్యంత వేగంగా సిటీ డెవలప్ అవుతోంది. ఐటీ కంపెనీలు, ఎడ్యుకేషన్, మెడికల్ హబ్ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా వరంగల్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కూడా భూములకు మంచి రేట్లు పలుకుతున్నాయి. ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షో అనేది సామాన్యులకు మంచి అవకాశం. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రుణాలు పొందేందుకు బ్యాంకులను కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చి మంచి కార్యక్రమం నిర్వహించారు.
– మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్
డీసీసీబీ ద్వారా రుణాలు ఇస్తున్నాం..
అందరికీ అన్ని రకాలుగా ఆర్థికంగా నిలబడేందుకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే మంచి అవకాశం కల్పించింది. ప్రజల్లో భద్రత కల్పించారు. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరగడం వల్ల చాలా విలువైన భూమిని కొనుగోలు చేసేందుకు విశ్వాసం, నమ్మకం కలిగించేలా ఏర్పాటుచేయడం అభినందనీయం. రేపటి కోసం మంచి నిర్ణయం తీసుకునేందుకు ప్రజలు అన్ని విధాలా ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ తరహాలో భూములకు వరంగల్లో రేట్లు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా మంచి అవకాశం కల్పించింది. సహకార బ్యాంకు ద్వారా రైతులకు వ్యవసాయ భూములకు, ఇల్లు కట్టుకోవడానికి రుణాలు అందిస్తున్నాం. పిల్లల భవిష్యత్కు మంచి అవకాశం, రియల్ ఎస్టేట్, వెంచర్స్, ఇండిపెండెంట్ హౌస్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఓపెన్ ప్లాట్స్కు ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ ప్రజలకు డీసీసీబీ ద్వారా రుణాలు కూడా అందిస్తుంది.
– మార్నేని రవీందర్రావు, డీసీసీబీ చైర్మన్
హైదరాబాద్ తరహాలో ప్రాపర్టీ షో
హైదరాబాద్ తరహా వరంగల్లో కూడా ఇలాంటి ప్రాపర్టీ షో పెట్టడం బాగుంది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు చాలా ఉపయోగపడతాయి. తరచూ ప్రాపర్టీ షోలు నిర్వహించడం వల్ల ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బ్యాంకర్లకు కూడా ఉపయోగంగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 20 వరకు ఏవీ ఇన్ఫ్రాకాన్ ప్రాజెక్టు ప్రజలకు చేరువవుతోంది. ప్రజలకు కావాల్సిన అన్నిసౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువస్తున్నాం. నమ్మకం, నాణ్యతతో కూడినవి అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.
– విజయ్కుమార్, సీఎండీ, ఏవీ ఇన్ఫ్రాకాన్
తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తున్నాం..
ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీ వారి తో పాటు ప్రముఖ సెంట్రల్ బ్యాంకు లను ఒకే వేదికపైకి తీసుకురావడం మంచి నిర్ణయం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వారు నిర్వహించిన ప్రా పర్టీ షోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొనుగోలుదారులు తమకు కావాల్సిన సమాచారం తెలుసుకు నేందుకు ప్రాపర్టీ షో మంచి అవకాశం కల్పించింది. బీవోబీ ద్వారా అన్ని రకాల లోన్లు తక్కువ వడ్డీకే అంది స్తున్నాం. ఎలాంటి ప్రాసెస్ ఫీజు, లాగిన్ ఫీజు లేకుండా ప్రజలకు అందిస్తున్నాం. చాలా మంది సందర్శకులు వచ్చారు.
– పిట్ట సురేశ్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్, వరంగల్