ఏటూరునాగారం : మండలంలోని రొయ్యూరు గ్రామానికి చెందిన సుందిళ్ల వెంకటేశ్కు జేఈఈ అడ్వాన్స్లో 1232 ర్యాంకు సాధించి ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ఐఐటీలో సీటు సంపాధించాడు. వ్యవసాయం చేసుకునే సుందిళ్ల కొండయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు వెంకటేశ్ రొయ్యూరులోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. తర్వాత జాకారంలోని గురుకుల పాఠశాల, కరీంనగర్ జిల్లా అలుగునూరులోని ఎక్స్లెన్సీ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్లో 1232 ర్యాంకు సాధించి ఐఐటీలో సివిల్ ఇంజినీర్గా అడ్మిషన్ పొందాడు.
నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్ జేఈఈలో 1232 ర్యాంకు రావడంపై భారత నాస్తిక సమాజం జిల్లా అధ్యక్షుడు కొండగొర్ల రాజేశ్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఐఏఎస్ కావాలనే ఆకాంక్షతో వెంకటేశ్ ఉన్నట్లు బంధువులు తెలిపారు. నిరుపేద కుటుబానికి చెందిన వెంకటేశ్కు ఆర్థిక సహాయం అందించడానికి దాతలు ముందుకు రావాలని కోరాడు.