ములుగు, జనవరి 29 (నమస్తే తెలంగాణ) :మేడారం మహాజాతరలో భక్తులకు ఎక్కడా లోటుపాట్లు ఉండొద్దని, కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, సమన్వయంతో విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్ ఆదేశించారు. సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసులతో కలిసి ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన మేడారంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మేడారాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించక పోయినా రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తూ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నదని చెప్పారు. అంతకుముందు అంతా కలిసి అమ్మవార్లకు మొకులు చెల్లించుకున్నారు.
ములుగు, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరను ప్రత్యేక కార్యాచరణతో విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లో ల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షే మ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించా రు. జాతరపై ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తుతో కలిసి అ ధికారులు, ప్రజాప్రతినిధులతో శనివారం సమీ క్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మంత్రి దయాకర్రావు అమ్మవార్లకు ఎత్తు బం గారం సమర్పించారు. అంతకుముందు అంద రూ కలిసి సమ్మక-సారలమ్మకు మొకులు చెల్లించారు. అనంతరం జరిగిన సమావేశంలోమంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల్లో భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు జాతరలకు రూ.332కోట్లు కేటాయించి భక్తుల కోసం శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. కరో నా కారణంగా భక్తులు ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నందున ఫిబ్రవరి మొదటి వారం నుంచి సౌకర్యాలను మెరుగు పరచాలని సూచించారు. వైద్యం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గతం కంలే అధిక సంఖ్యలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
అదనంగా పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలన్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదయిన మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గు ర్తించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం క్రమ తప్పకుడా నిధులు విడుదల చేస్తూ భక్తులకు లోటుపాట్లు రాకుండా చూస్తున్నదని చెప్పారు. ఫిబ్రవరి 18న సీఎం కేసీఆర్ మేడారం వచ్చి సమ్మక-సారలమ్మలను దర్శించుకునే అవకాశం ఉందన్నారు. వీఐపీలకు కల్పించే విధంగానే సామాన్య భక్తులకు కూడా అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేయాలన్నారు. వీఐపీ పాస్లు ఒకేరోజు చెల్లుబాటయ్యేలా తయారుచేయాలన్నా రు. జాతర పరిసరాల్లో ఆద్యంతం పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.
ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలి : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
ట్రాఫిక్ సమస్య రాకుండా, రోడ్ల వెంట వాహనాలను పార్కింగ్ చేయకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాది వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని నిర్దేశించిన పార్కింగ్ స్థలాలకు తరలించేలా చూడాలని, భక్తులు మొక్కలు తీర్చుకోవడంలో ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. జంపన్నవాగు వద్ద నీరు ఎప్పుడూ నిండుగా ప్రవహించేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భక్తులకు పంపిణీ చేసేందుకు 50 లక్షల మాస్లను, శానిటైజర్ను ఎకువ మోతాదులో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వీఐపీ పాస్లను తేదీల వారీగా కేటాయించాలన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి : సీఎస్ సోమేశ్కుమార్
ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు సంతృప్తికరంగా ఉన్నాయని, వాహనాల పారింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అధికారులను ఏబీసీ బృందాలుగా ఏర్పాటు చేసి విడుతలవారీగా విధులు కేటాయించాలన్నారు. జాతర పూర్తయ్యేదాకా ప్రతి మూడు నాలుగు రోజులకోసారి హైదరాబాద్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని తెలిపారు.
భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యం : మంత్రి సత్యవతిరాథోడ్
జాతకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ వస్తున్నదని రాష్ట్ర గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. షెడ్లలో తాగునీటి వసతి కల్పించి, ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. కరోనాపై అప్రమత్తంగా ఉంటూనే పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో ప్రధాన భూమిక పోషించాలన్నారు.
సమన్వయంతో పనిచేయాలి : డీజీపీ మహేందర్రెడ్డి
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచే యాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. పనివేళలు తగ్గించి సమర్థవంతంగా విధులు నిర్వర్తించేం దుకు కృషిచేయాలన్నారు. అనంతరం గద్దెల వద్ద ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్లు కుసుమ జగదీశ్వర్, గండ్ర జ్యోతి, ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, తకళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు సీతక, అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఐజీ నాగిరెడ్డి, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆశ, దేవాదాయ శాఖ కమిషనర్ అశోక్ కుమార్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వైవీ గణేశ్, జడ్పీ వైస్చైర్మన్ బడే నాగజ్యోతి, మేడారం సర్పంచ్ చిడెం బాబూరావు, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, జడ్పీటీసీలు సకినాల భవాని, గై రుద్రమదేవి, తుమ్మల హరిబాబు, ఎంపీపీలు గొంది వాణిశ్రీ, గండ్రకోట శ్రీదేవి, సూడి శ్రీనివాస్ రెడ్డి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.