ములుగు : జిల్లాలో మావోయిస్టుల వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపూరి కాలనీ గ్రామ సమీపంలోని భద్రాచలం-వెంకటాపురం జాతీయ ప్రదాన రహదారి పక్కన భీమదేవర కొండ అమరవీరులకు జోహార్లు అంటూ వాల్ పోస్టర్లు అంటించారు. పట్టపగలే మావోయిస్టుల వాల్ పోస్టర్లు, లేఖలు లభ్యమవడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. వాల్పోస్టర్లు ఎవరు అంటించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.