రామగిరి, జనవరి 6: నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకోవాలంటే యంత్రా ల పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆర్జీ 3 జీఎం మనోహర్ అన్నారు. సీఎండీ ఆదేశాల మేరకు ఆయన ఏరియాలోని గనులను గురువారం సం దర్శించి ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఓసీపీ-2 గనిపై యంత్రాల పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఓసీపీ-2కి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, లక్ష్యాన్ని 94 శాతం, ఓబీ 89 శాతం మాత్రమే సాధించామని పేర్కొన్నారు. ఇప్పుడు యంత్రాలు సుమారు 12 గంటలు మాత్రమే ఉపయోగించుకుంటున్నామని, దానిని 18 గంటలకు పెంచాలన్నారు. అందుకు ఉద్యోగులు, ఆపరేటర్లు సహకరించాలని కోరా రు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, పీవో న రేందర్, పీఈ వెంకటేశ్వరరావు, మేనేజర్ రామారావు, డీజీఎం చంద్రశేఖర్, పిట్ సెక్రటరీ రవిశంకర్ ఉన్నారు.
రామకృష్ణాపూర్ గనిలో..
భారీ యంత్రాల పనిగంటలు పెంచి పూర్తి స్థాయిలో వినియోగించి అధిక ఉత్పత్తిని సాధించాలని మందమర్రి ఏరి యా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. రామకృష్ణాపూర్ ఉపరితల గని ఈపీ ఆపరేటర్లతో గురువారం నిర్వహించిన సదుస్సులో యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ మనుగడ కోసం ఉద్యోగులు అందరూ కృషి చేయాలని కో రారు. ప్రస్తుతం భారీ యంత్రాలు హెచ్ఈఎంఎం (హెవీ ఎర్త్ మూవింగ్ మిషనరీ) 13 నుంచి 14 గంటలు నడుస్తున్నాయని తెలిపారు. 18 గంటలకు పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో ఏరియా ఇంజినీర్ ఏజీ ఎం రాంమూర్తి, ఐఈడీ రాజన్న, ఆర్కేపీ ఓసీ పీవో మధుసూదన్, ప్రాజెక్ ఇంజినీర్ మహేందర్, ఇన్చార్జి మేనేజర్ రామరా జు, స్ట్రక్చర్ కమిటీ సభ్యులు శంకర్రావు, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్అలీ, ఉపాధ్యక్షుడు ఇప్పకాయల లింగయ్య, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి కొసపాటి రాజ్కుమార్, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి అంజయ్య, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.