ములుగు : నియోజకవర్గంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా ఉద్యోగులు పనిచేయాలని మంత్రి దినసరి అనసూయ సీతక్క( Minister Sitakka) కోరారు. బుదవారం ములుగు ఇంచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి , ఎస్పీ శభరిష్ , ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రామిశ్రా తో కలిసి నియోజకవర్గ అభివృద్ధి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధి పనులకు(Permanent Works) ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
కేవలం జీతం కోసం పని చేయకుండా ప్రజల కోసం పనిచేస్తే అధికారులను ప్రజలు కలకాలం తెలిపారు. సమస్యలను తెలుపడానికి వచ్చే సమయంలో ఉద్యోగులు ఓపికతో సమాధానం చెప్పి పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో కుటీర పరిశ్రమలు(Cottage industries) ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా విధంగా ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు.
అటవీ అధికారులు ముఖ్యంగా అడవుల వల్ల ప్రజలకు ఎలాంటి లాభాలు చేకూరుతాయో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులందరూ ఒకే లక్ష్యంతో పనిలో పోటీపడి పని చేయాలని అన్నారు . డీఆర్డీవో ద్వారా మహిళా సంఘాల సభ్యులకు(Dwacra Womens) రుణాలు అందించాలని వెల్లడించారు. నూతన విద్యా సంవత్సరంలోనే ప్రాథమిక పాఠశాలల ఆవరణలో అంగన్వాడీ కేంద్రాలను(Anganwadi Centres) ప్రారంభించనున్నట్లు తెలిపారు.