గిర్మాజీపేట/కరీమాబాద్/ఖిలావరంగల్, ఆగస్టు 3: తల్లిపాలతో తల్లిబిడ్డలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటారని సీడీపీవో విశ్వజ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం వరంగల్ 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆశాదేవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లీబిడ్డకు మధ్య అనుబంధం ఏర్పడడమే కాకుండా తల్లుల్లో రొమ్ము, అండాశయ క్యాన్సర్ రాదని వివరించారు. అంగన్వాడీ టీచర్లు ఏ శారద, ఆర్ జ్యోతి, పీ వనజ, ఆయా సవిత పాల్గొన్నారు. కరీమాబాద్ 32వ డివిజన్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ బత్తిని రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కార్పొరేటర్ పల్లం పద్మ పాల్గొని మహిళలకు అవగాహన కల్పించారు. తల్లిపాలతోనే పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నారు. ఖిలావరంగల్ 35వ డివిజన్ శివనగర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, సూపర్వైజర్ జంపాల సుజన, ఏఎన్ఎం ఉప్పలమ్మ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
తల్లిపాలు పిల్లలకు ఆరోగ్యం
ఖానాపురం/నల్లబెల్లి/చెన్నారావుపేట/పోచమ్మమైదాన్: తల్లిపాలు పిల్లలకు ఎంతో ఆరోగ్యకరమని వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి అన్నారు. ఖానాపురం మండలం అశోక్నగర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రమ, అంగన్వాడీ టీచర్లు విజయకుమారి, శమంతకమణి, అనసూర్య, విజయ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. నల్లబెల్లి మండలం రుద్రగూడెం సర్కిల్లోని గుండ్లపహాడ్, లెంకాలపల్లిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో హేమలత మాట్లాడుతూ ముర్రుపాలు బిడ్డకు ఆయువుపట్టు అన్నారు. సుమారు ఆరు నెలల వరకు పిల్లలకు ద్రవపదార్థాలు ఇవ్వకుండా తల్లిపాలు పట్టాలని సూచించారు. సర్కిల్ సూపర్వైజర్ ఝాన్సీరాణి, అంగన్వాడీ మండల అధ్యక్షురాలు బంధం లత, ఆకుల సునీత పాల్గొన్నారు. చెన్నారావుపేటలో సర్పంచ్ కుండె మల్లయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు నరేందర్, వార్డు మెంబర్ సతీశ్ పాల్గొన్నారు. అలాగే, బాపూనగర్లోని అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలను సర్పంచ్ మంగమ్మ, అంగన్వాడీ టీచర్ సుగుణ ఆధ్వర్యంలో నిర్వహించారు. వరంగల్ 21వ డివిజన్ లోతుకుంట అంగన్వాడీలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.