వరంగల్ చౌరస్తా/పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 9 : స్వరాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన అమరులు, ఉద్యమం చేసిన తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. బుధవారం పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై విషం కక్కిన ప్రధాని తీరుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడువేల బైక్లతో ఆజంజాహి మిల్లు స్థలం నుంచి ర్యాలీ తీశారు. తూర్పు ని యోజకవర్గం పరిధిలోని డివిజన్ల వారీగా అక్కడికి చే రుకున్న కార్యకర్తలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నల్ల జెం డాలతో నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ జంక్షన్, పో చమ్మమైదాన్ సెంటర్లో ఆందోళన చేపట్టారు. ప్రధా ని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో రా ష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. అ న్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సిన ప్రధాని ఒక్క గుజరాత్కే పీఎంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ విభజనను పదే పదే అవమానిస్తూ, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంపై తన అక్కసును వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. దేశంలో 42 పార్టీలు తెలంగాణ ఏ ర్పాటుకు మద్దతు ఇచ్చాయని, కేంద్ర ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ అన్ని వర్గాలతో చర్చించిన విషయాన్ని మరిచిపోవడం విచారకరమన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు ఆరుణ్ జై ట్లీ, వెంకయ్యనాయుడు, అద్వాని, సుష్మ స్వరాజ్ తె లంగాణ బిల్లుపై చర్చలో పాల్గొన్నారని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్కు కీర్తి, ప్రతిష్టలు పె రుగడం చూసి ఓర్వలేక ప్రధాని తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరూ కావాలంటున్నారన్నారని, ప్రధాని పాలననూ తిరస్కరించడంతో దిక్కుతోచక మోదీ అడ్డగోలు వాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇంతవరకు తెలంగాణతో పెట్టుకున్నవారెవరూ పొడుగెల్లలే…ఎవరెన్నీ కుట్రలు చేసినా తెలంగాణను ఏమి చేయలేరు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి దిక్సూచిగా నిలుస్తుంది.’ అని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ పీడ విరగడవుతుందని, మతాల మధ్య చిచ్చు పెడుతూ, రాష్ర్టానికో వేషం మార్చడమే ఎజెండాగా మోదీ పెట్టుకున్నారని విమర్శించారు.
ఢిల్లీలో పార్టీ ఉన్నా ఇక్కడ గల్లీలో ఉన్న బీజేపీ నేతలకు తెలంగాణపై సోయిలేదన్నారు. ధైర్యం ఉంటే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మోదీని నిలదీయాలని, ఎంపీలు అరవింద్, సంజయ్ అబద్దాల నాయకులుగా మారారని, తెలంగాణను అవమానిస్తున్న నాయకులపై నోరు మెదపని దద్దమ్మలని పేర్కొన్నారు. నిజామాబాద్కు పసుపుబోర్డు తీసుకురాని నాయకులు కేసీఆర్ను విమర్శిస్తున్నారన్నారు. ఇక తెలంగాణ నుంచి బీజేపీ పతనానికి నాంది పడిందని, కేసీఆర్ నాయకత్వంలో దేశంలో పెనుమార్పులు రానున్నాయని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీ వెంకటరమణ జంక్షన్ మీదుగా కాశీబుగ్గ సెంటర్కు చేరుకుంది. కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.