హనుమకొండ చౌరస్తా, మే 18 : ప్రభుత్వ మెడలు వంచి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ పోరాడుతానని వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్య ర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ‘మీట్ ద ప్రెస్’లో ఆయన మాట్లాడారు. గెలిస్తే తన ఎమ్మెల్సీ వేతనంతో విద్యార్థి, నిరుద్యోగ సంక్షేమ నిధి ఏర్పాటుచేస్తానన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రైతుబంధు అడిగితే రైతులను చెప్పుతో కొడతా అని వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడని, అలాంటి వ్యక్తికి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. జీవో 46ను ప్రభుత్వం రద్దు చేసేవరకూ సభను స్తంభింపజేస్తానన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ గల్లా ఎగరేసేలా తన నడవడిక ఉంటుందన్నారు. పట్టభద్రుల ఎమ్మె ల్సీ స్థానమైన వరంగల్-ఖమ్మం-నల్లగొండ ప్రాంతంలో 32మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రతిపక్షానికి చెందిన వారున్నారని, ప్రతిపక్షం బలం గా ఉంటేనే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందని పేర్కొన్నారు. తాను ఓరుగల్లు బిడ్డనని, కష్టపడి చదివి బిట్స్ పిలానీలో సీటు సాధించి గోల్డ్ మెడల్ పొందానని గుర్తుచేశారు. విద్యార్థి సంఘం ఎన్నికల్లో రెండుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. కేసీఆర్ తనను ఆశీర్వదించి పంపారని, నాలుగుసార్లు ఈ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగిరిందన్నారు.
చుకా రామయ్య నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి వరకు సమాజానికి ఆదర్శంగా నిలిచే వారిని ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారని, మోసగాళ్లను నమ్మొద్దని మేధావులకు పిలుపునిచ్చారు. 2013లో రాజకీయాల్లోకి వచ్చానని, అమెరికాలో ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశానని, పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు ఇకడనుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీలో ప్రజాపోరాటం చేశానని, కులం, మతం, వర్గం అనే బేధం లేకుండా సమస్యలపై పోరాడానన్నాను. బీజేపీ తనను రోడ్డున పడేస్తే, కొన ఊపిరితో ఉన్న తనను కేసీఆర్ అక్కున చేర్చుకుని ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ఇక్కడికి పంపించారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, బలమైన ప్రతిపక్షం ఉంటే నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిస్తే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా?.. తనను గెలిపిస్తే సమస్యలపై నిలదీస్తానన్నారు. నిరుద్యోగ కోసం జాబ్మేళాలు నిర్వహించానని, కోచింగ్ సెంటర్లో ఫీజు కట్టలేకపోతున్న వారి కోసం ఈ-క్లాసెస్ యాప్ను ఉచితంగా రూపొందించానని పేర్కొన్నారు. జర్నలిజానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, జర్నలిజాన్ని ఎర్నలిజంగా మార్చిన కాంగ్రెస్ అభ్యర్థిని నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఐపీఎల్ మ్యాచ్ కంటే కేసీఆర్ మీటింగ్కు రేటింగ్ ఎకువ ఉందన్నారు. వరంగల్ జర్నలిస్టులు తనను ఇకడిదాకా తీసుకొచ్చారని, రాష్ట్ర స్థాయి నాయకుడిగా నిలబెట్టారన్నారు. మీ సహకారం ఉంటే మండలిలో ప్రతినిధిగా గౌరవాన్ని కాపాడుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా గెలుచి కేసీఆర్కు బహుమతిగా ఇస్తానన్నారు. సమావేశంలో ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్య పాల్గొన్నారు.