హనుమకొండ, మార్చి 15 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝాను కోరారు. శుక్రవారం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి సీపీకి వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నియోజకవర్గ శాసన సభ్యుల అధికార నివాసం(క్యాంప్ ఆఫీస్) వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కాంగ్రెస్ శ్రేణులు ధ్వంసం చేశాయని, ఇటీవల వడ్డేపల్లి ముదిరాజ్ వాడలో మరో శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, బీఆర్ఎస్ శ్రేణులపై కొందరు కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని వినతి పత్రంలో పేరొన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మైనార్టీ కమిషన్ మెంబర్ దర్శన్సింగ్, కుడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, లలితాయాదవ్, కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్రావు, బీ అశోక్ యాదవ్, చెన్నం మధు, సోదా కిరణ్, రంజిత్రావు, విజయలక్ష్మి, లోహిత, నాయకులు సురేంద ర్, రాజు, కుమార్యాదవ్, పరశురాములు, శ్రీధర్, ప్రశాంత్, రాకేశ్ పాల్గొన్నారు.