వరంగల్ : జిల్లాలోని నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలోని ‘సీతారామాంజనేయ స్వామి’ వారి ఆలయంలో నిర్వహించిన మహా గణాధిపతి, నాగేంద్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సంతాన నాగేంద్రస్వామి వార్ల విగ్రహ ప్రతిష్టపాన మహోత్సవాని నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆ భగవంతుడి ఆశీస్సులు గుండ్రపల్లి గ్రామ ప్రజలపై నిత్యం ఉండాలని, గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాల స్వామి వార్లను కోరుకున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.