గ్రాండ్గా ఎమ్మెల్యే శంకర్నాయక్ పుట్టిన రోజు వేడుకలు
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి, ఎమ్మెల్సీ రవీందర్రావు
క్యాంప్ ఆఫీస్లో 108 కిలోల కేక్కట్ చేసి సంబురాలు
మహబూబాబాద్ రూరల్, మే 20 : మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ 52వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు, టీఆర్ఎస్ నాయకులు పట్టణ శివారులోని అనంతాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ముఖ్య అతిథులుగా హాజరై ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటా రు. అనంతరం రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 306 మంది నుంచి రక్తం సేకరించి సొసైటీకి అందజేశారు. టీఆర్ఎస్ జిల్లా నాయకులు తెచ్చిన 108 కిలోల కేక్ను ఎమ్మెల్యే శంకర్నాయక్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలకు అన్నదానం చేశారు. పాత, కొత్తబజార్, వివేకానంద సెంటర్, తహసీల్దార్ కార్యాలయం, మదర్ థెరిస్సా సెంటర్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా మౌనిక, జడ్పీటీసీ లూనావత్ ప్రియాంక, మున్సిపల్ వైస్చైర్మన్ ఎండీ ఫరీద్, యాళ్ల మురళీధర్రెడ్డి, మార్నేని వెంక న్న, నాయిని రంజిత్కుమార్, లూనావత్ ప్రియాంక, తేళ్ల శ్రీను, అశోక్నాయక్, సురేందర్నాయక్, రాంచందర్ నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
మార్కెట్లో రైతులకు అన్నదానం
కేసముద్రం: మండల కేంద్రంతో పాటు, 40 గ్రామా ల్లో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. మార్కెట్లో పంట ఉత్పత్తుల విక్రయానికి వచ్చిన రైతులకు అన్నదానం చేశారు. 24 మంది కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. సర్వమత ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నజీర్ అహ్మద్, ఎంపీపీ ఓలం చంద్రమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరావు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, పార్టీ నాయకులు యాకూబ్రెడ్డి, ఎన్ దుర్గేశ్, ఎస్ వెంకన్న, జీ హరీశ్నాయక్, డీ వెంకన్న, కే శ్రీనివాస్, డీ రామ్మూర్తి, ఆర్ నవీన్రెడ్డి, బీ మహేందర్రెడ్డి, జీ వీరునాయక్, కే రవీందర్రెడ్డి, జీ రమేశ్, ఎల్ పిచ్చయ్య, ఎస్ నరేశ్, కే రాహుల్, జీ వీరస్వామి, ఎన్ యాకయ్య, ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
వీరభద్రస్వామి ఆలయంలో పూజలు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో మానుకోట ఎమ్మెల్యే శంకర్నాయక్ సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు సాధరంగా స్వాగతం పలికారు. గోత్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ముఖ మండపంలో శాలువాతో సత్కరించి, ఆశీర్వచనం తెలిపారు. ఆయన వెంట మానుకోట పట్టణ యూత్ అధ్యక్షుడు యార్ల మురళీదర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, బండారు వెంకటరమణ, వైద్యులు సీతామహాలక్ష్మి, సౌజన్య ఉన్నారు.
గూడూరులో రక్తదానం, అన్నదానం
గూడూరు: ఎమ్మెల్యే శంకర్నాయక్ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలోని సీహెచ్సీలో టీఆర్ఎస్ నాయకులు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. బస్టాండ్ ప్రాంతంలో వెయ్యి మంది పేదలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. బొద్దుగొండ సర్పంచ్ ముక్కా లక్ష్మణ్రావు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 46 మంది రక్తదానం చేశారు.
తీగలవేణి గ్రామంలో ‘మన ఊరు- మన బడి’లో భాగంగా నూతన గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకర్నాయక్ శంకుస్థాపన చేశారు. కాగా, సర్పంచ్ లక్ష్మణ్రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఖాసీం, పార్టీ మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, ఎన్ సురేందర్, వేం మోహన్రెడ్డి ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏపూర్ గ్రామంలో సర్పంచ్ మౌనికాదిలీప్నాయక్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు రన్నింగ్ సూట్లు, స్టడీ మెటీరియల్ అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బయ్య మల్లేశ్, మల్లయ్య, బిక్కు, శంకర్ పాల్గొన్నారు. అదేవిధంగా సీతానగరం, గుండెంగ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, పీఏసీఎస్ మాజీ వైస్చైర్మన్ దేశిడి మన్మోహన్రెడ్డి మండల కేంద్రం నుంచి గుంజేడు ముసలమ్మ జాతర వరకు పాదయాత్ర చేశారు. ఎమ్మెల్యే నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మండలానికి మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని అమ్మవారిని కోరుకున్నట్ల్లు తెలిపారు.
అంబేద్కర్ సెంటర్లో మహా అన్నదానం
నెల్లికుదురు: మానుకోట ఎమ్మెల్యే శంకర్నాయక్ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో 800 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్రెడ్డి, జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారని తెలిపారు. కాగా, వివిధ గ్రామాల్లో కేక్లు కట్ చేశారు. కార్యక్రమంలో నెల్లికుదురు సర్పంచ్ బీరవెళ్లి యాదగిరిరెడ్డి, ఎంపీటీసీ వెన్నాకు వాణి, వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేశ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దర్శనం భిక్షపతి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేశ్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర్రెడ్డి, తొర్రూరు ఏఎంసీ వైస్ చైర్మన్ విజయ్ యాదవ్, సొసైటీ చైర్మన్లు జీ వెంకన్న, కే లక్ష్మీచంద్రశేఖర్రెడ్డి, దేవేందర్రావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు జీ ఆదిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పీ రామచంద్రు, యూత్ విభాగం మండల అధ్యక్షుడు వంశీ, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.